ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు ఏనాడో చెప్పారు. అయితే డబ్బే పరమావధిగా భావించి ఏకంగా ప్రియుడ్నే బ్లాక్ మెయిల్ చేసింది ఓ యువతి. బెంగళూరులో వెలుగుచూసిన ఈ ఘటనలో అమెకు పోలీసులు అరదండాలు వేయడంతో కథ సుఖాంతమైంది. వినడానికే విచిత్రంగా వున్నా.. ఇది నిజం. ప్రియుడ్ని ఏకంగా కోటి రూపాయల మేర డిమాండ్ చేయడంతో అతను దిక్కుతోచని పరిస్థితులలో పోలీసులను అశ్రయించాడు. యువతి, ప్రియుడి నగ్న ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనపై స్థానిక పోలీసులు కూడా అశ్చర్యపోయారు.
సాధారణంగా ఏకాంతంగా గడిపిన ఫోటోలను, వీడియోలను నెట్ లో అప్ లోడ్ చేస్తామని బెదిరించి.. వారిపై మరోమారు అత్యాచారాలకు తెగబడటం.. లేదా వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపడం వంటి ఘటనలు చూసిన పోలీసులు.. ఈ కేసును దర్యాప్తు చేసి.. మాయలేడిని కటకటాల వెనక్కి నెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని నామక్కల్ జిల్లా, రాశిపురం ప్రాంతానికి చెందిన ప్రేమ్ కుమార్(26) బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో పని చేస్తున్నాడు. ఖాళీ సమయంలో స్నేహితులతో ఫేస్ బుక్ లో చాటింగ్ చేసే ప్రేమ్ కుమార్ కు బెంగళూరుకు చెందిన అర్చన (22) తో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.
పరిచయం కాస్తా హద్దులు దాటి ఏకంగా వారి మధ్య ప్రేమకు దారితీసింది. దీంతో ఇరువురూ కొంతకాలం ఫేస్ బుక్ ద్వారా చాటింగ్ చేసుకున్నారు. ఆ తరువాత ఒకరినోకరు కలవాలని భావించారు. అలా వారు అనుకున్న రోజు వచ్చింది. ఇద్దరు కొంతకాలం ఇలానే చాటుమాటు ప్రేమతో ఆనందంగా గడిపారు. చనువు పెరగడంతో ఇద్దరు హద్దులు కూడా దాటారు. అయితే తాము ఏకంతంలో వున్న సమయంలో ప్రేమ్కుమార్ నగ్నంగా ఉన్న ఫోటోలను అతనికి తెలియకుండా తీసింది అర్చన. ఇద్దరి మధ్య కొంతకాలానికి దూరం పెరిగింది. అంతే ప్రేమ్ కుమార్ నగ్న ఫొటోలు చూపి అతడి వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more