బుధవారం తమిళనాడులో బుధవారం జరిగిన పొలిటికల్ హైడ్రామా ముదిరిపోతుంది. కేవలం న్యాయవాదిపైనే దాడి చేశారనుకుంటే రాజ్యసభ సభ్యురాలు, రెబల్ శశికళ పుష్ప భర్త లింగేశ్వర్ తిలకన్ ను కూడా అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు వదలిపెట్టలేదంట. రక్తమోడుతున్నా వదిలి పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు ముష్టిఘాతాలు కురిపించారు. నోరు, ముక్కులో నుంచి రక్తం కారుతున్నా ఆయనను వదిలిపెట్టలేదు. చివరికి పోలీసులు ఆయనను రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు.
నేడు జరగనున్న పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ ప్రధాన కార్యర్శిని ఎన్నుకోనున్నారు. ఈ పదవికి శశికళ పుష్ప కూడా పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం శశికళ భర్త లింగేశ్వర్ ఐదుగురు న్యాయవాదులతో కలిసి స్థానిక రాయపేటలో ఉన్న అన్నాడీఎంకే కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నామినేషన్ పత్రాన్ని కొనుగోలు చేశారు. దానిని పూర్తిచేసి శశికళ పుష్ప తరపున నామినేషన్ వేసేందుకు ప్రయత్నిస్తుండగా అన్నాడీఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడిచేశారు.
పార్టీ కార్యాలయంలో ఆయన విధ్వంసం సృష్టించేందుకు, గొడవులు పెట్టేందుకే వచ్చారని ఆరోపిస్తూ ముష్టిఘాతాలు కురిపించారు. భర్తపై దాడి జరుగుతున్న సమయంలో శశికళ పుష్ప కార్యాలయం బయట కారులోనే ఉన్నట్టు సమాచారం. కాగా, ఆంధ్రప్రదేశ్ కు చెందిన గుండాలతో తమపై దాడి చేయించారని శశికళ భర్త పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. లేఖ ఇవ్వటానికి వెళ్లిన సమయంలోనే తమకు అడ్డుకుని శశికళ పుష్ప ఎవరు ? ఆమెకు అన్నాడీఎంకే పార్టీకి ఏమి సంబంధం ? ఎందుకు వచ్చారు ? మర్యాదగా వెళ్లిపోండి అంటూ తమను రక్తం వచ్చేటట్లు కొట్టారని ఆయన చెప్పాడంట.
అయితే దాడి తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ శశికళ పోలీసులకు ఫిర్యాదు చేయటం గమనార్హం. మరోవైపు అన్నాడీఎంకే కార్యకర్తలు కూడా శశికళ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more