హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లో కేబీఎస్ బ్యాంకు సీఈఓ మన్మథ్ దలైపై జరిగిన కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ముగ్గురు యువకులు కలసి బ్యాంక్ సిఈఓపై కాల్పులకు స్కెచ్ వేశారని, అయితే వీరికి బ్యాంకు సీఈఓ డ్రైవర్ ఇంటి గుట్టు తెలిపాడని వెల్లడించారు. నిందితులందరూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారేనన్నారు.
నరేష్, షేక్ అబ్దుల్ రహీమ్, రాజేందర్, వెంకటరత్నంలను నిందితులుగా గుర్తించారు. ఇందుకు సంబంధించి ముగ్గురు యువకులను అరెస్టు చేశామని, మరోకరి కోసం గాలింపు చేపట్టామని చెప్పారు. ఈ నెల 18న మన్మథ్ దలైపై దోపిడీకి యత్నించిన దుండగుడు రెండు రౌండ్ల కాల్పులకు పాల్పడ్డాడని మహేందర్ రెడ్డి తెలిపారు. బ్యాంకు సీఈఓ నివాసంలోకి వెళ్లి కాల్పులు జరిపింది షేక్ అబ్దుల్ రహీమ్ గా పోలీసులు తెలిపారు.
నిందితుల నుంచి దేశవాళీ తుపాకీతో పాటు 12 బుల్లెట్లు, ఒక మోటార్ బైక్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మహేందర్ రెడ్డి చెప్పారు. కాగా నరేష్ సోదరుడు శ్రీహరి దలాయ్ కారు డ్రైవర్ అని, అయితే అతనికి తెలియకుండానే వాళ్లు అతని నుంచి సమాచారం రాబట్టారని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. పెద్ద నోట్ల విషయంలో బ్యాంకు మేనేజర్ల పాత్రపై చర్చించికున్న వీరు అప్పటికప్పుడు ప్రణాళికను వేసుకుని దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more