తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకున్న ఆయన రాజాజీ హాలుతో ప్రజల సందర్శనార్థం వుంచి జయలలిత పార్థివదేహాంపై పుష్పా గుచ్చాన్ని వుంచి ఘనంగా నివాళులు అర్పించారు. జయలలిత పార్థివదేహం వద్ద ప్రధాని మోదీ పుష్పగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. జయలలిత స్నేహితురాలు శశికళను మోదీ పరామర్శించారు. ఈ సందర్భంగా శశికళ, తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కన్నీటి పర్యంతమయ్యారు. మోదీ.. వీరిద్దరినీ ఓదార్చారు. పన్నీరు సెల్వం భుజం తట్టి క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాల్సిందిగా చెప్పారు.
జయలలితను చివరిసారి చూసేందుకు వచ్చిన ప్రముఖులకు, ప్రజలకు మోదీ అభివాదం చేశారు. మోదీ వెంట తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు వచ్చారు. అక్కడే ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడితో మోదీ కాసేపు మాట్లాడారు. మెరీనా బీచ్లో సాయంత్రం గురువు ఎంజీఆర్ సమాధి పక్కన జయ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీతో పాటు ఎఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు.. జయలలిత అంత్యక్రియల్లో పాల్గొంటారు.
కాగా జయలలిత అనారోగ్యం వార్తలు తెలినప్పటి నుంచి ప్రధాని మోడీ, అమె కోలుకుంటారన్న ఆశతో ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ప్రముఖ డాక్టర్లను చెన్నైలోని అపోలో అస్పత్రికి పంపించారు. అయితే ఎయిమ్స్ వైద్యులతో పాటు విదేశీ వైద్యుడు కూడా శ్రమించినా.. అమ్మ తిరిగిరాని లోకాలు వెళ్లిన విషయం తెలిసిందే. కాగా ప్రధాని నరేంద్రమోడీ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పటి నుంచి అయనకు జయలలితకు మధ్య చక్కని స్నేహం వుంది. ఆ స్నేహంలో భాగంగానే అమె 2011లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నరేంద్రమోడీ హజరైన విషక్ష్ం కూడా తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more