మైక్రోబ్లాంగింగ్ సైట్ వాట్సాప్లో అత్యాచార వీడియోల నియంత్రణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం 11 నెలలుగా నోరు మెదకపకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రానికి మొట్టికాయలు వేసింది. సైబర్ నేరాల కేసుల దర్యాప్తుపై స్పష్టమైన విధివిధానాలు రూపొందించకపోవడాన్ని తప్పుబట్టింది.
సామాజిక మాద్యమాల్లో ఇలాంటి వీడియోలు, అశ్లీల దృశ్యాలు ప్రచారం అవుతుంటే ఏం చేస్తున్నారు? మీకు 11 నెలల గడువు కూడా చాలలేదా? అని కేంద్రం తరపున హాజరయిన న్యాయవాది బాల సుబ్రహ్మణ్యంను ప్రశ్నించింది. అయితే పార్లమెంట్ లో విధినిర్వహణలో అధికారులు బిజీగా ఉన్నారని, దీనికి కాస్త గడువు ఇవ్వాలంటూ ఆయన బెంచ్ కోరాడు. వెంటనే బెంచ్ వారు బిజీగా ఉన్నారంటే.. మేం ఇక్కడ ఖాళీగా ఉన్నామా? ఇది సరైన వైఖరి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసును వాయిదా వేసింది.
వాట్సాప్లో అత్యాచార వీడియోలు ప్రచారం కావడంపై హైదరాబాద్కు చెందిన స్వచ్ఛంద సంస్థ 'ప్రజ్వల' గతంలో సుప్రీంకోర్టుకు లేఖరాసింది. ఈ లేఖతోపాటు వాట్సాప్లో ప్రచారంలో ఉన్న రెండు అత్యాచార వీడియోలను పెన్ డ్రైవ్ ద్వారా అప్పటి చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తుకు పంపించింది. కోర్టు దీనిని సుమోటోగా స్వీకరించింది. కేసు దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది.
అలాగే సామాజిక మాధ్యమాల్లో అశ్లీల దృశ్యాలు ప్రచారం కాకుండా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసారశాఖను ఆదేశించింది. ఈ ఆదేశాలు జారీ చేసి 11 నెలలు గడుస్తున్నా కేంద్రం నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంపై జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ యూయూ లలిత్తో కూడి ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ శుక్రవారానికి కేసును వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more