మరో మూడు మాసాల వ్యవధిలో రానున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు పైచేయి సాధిస్తారన్న అసక్తి యావత్ దేశప్రజలలో నెలకోన్న నేపథ్యంలో మళ్లీ అధికారాన్ని దక్కించుకుని తమ సత్తా చాటాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారానికి నాంది పలికారు. గత కోంతకాలంగా ఇంటిపోరుతో నానా హైరానా పడినా.. ఎట్టకేలకు ప్రజలముందుకు వెళ్లాలని నిర్ణయించారు. తన పాలనపై ప్రజల్లోనే తేల్చుకునేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రారంభించిన వికాస్ రథయాత్రకు లక్నో వేదికైంది.
గత కొన్ని నెలలుగా రగులుతున్న రగులుతున్న ఇంటిపోరుతో ఉక్కిరిబిక్కిరి అయినా.. ఎట్టకేలకు ఇరువర్గాల మధ్య రాజీ కుదిరిందన్న సంకేతాలు బయటకు వచ్చాయి. దీంతో అఖిలేష్ ప్రచారపర్వంతో ఎన్నికల సమరశంఖాన్ని పూరించేందుకు లక్నోలో ర్యాలీ ఏర్పాటు చేశారు. అయితే ఈ ర్యాలీలో అబ్బాయ్ బాబాయ్ వర్గాలకు చెందిన కార్యకర్తలు బాహాభాహీకి దిగారు. నానా హైరానా చేశారు. కార్యకర్తలు పరస్పర దాడులు, ప్రతిదాడులతో ర్యాలీలో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగలోకి దిగిన పోలీసులు పరిస్తితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అధికంగానే శ్రమించాల్సి వచ్చింది.
లక్నో వేదికగా ఇవాళ ప్రారంభమైన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రథయాత్రకు పెద్దసంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఈ ర్యాలీ విజయవంతం అయితే తమ నాయకుడికి ఉనికికే ప్రమాదం పోంచివుంటుందన్న అందోళనతో శివపాల్ యాదవ్ వర్గానికి చెందిన కొందరు కార్యకర్తలు అఖిలేష్ వర్గ కార్యకర్తలతో దాడులకు దిగారు. రెండు వర్గాల కార్యకర్తలు కర్రలతో ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు వేదికపై వున్న అఖిలేష్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇలాంటి ఘటనలు సహజం.. ఇది చాలా చిన్న ఘటన అని అయన పేర్కోన్నారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది. తమ లాఠీలకు కూడా పనికల్పించాల్సి వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more