ఉభయ తెలుగు రాష్టాల మధ్య మళ్లీ పవర్ పంచాయితీ తలెత్తే అవకాశాలు వున్నాయి. ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణ నీటి విషయమై సాగుతున్న వివాదానికి తోడుగా పవర్ పంచాయితీ కూడా జతకలవనుంది. తెలంగాణకు కేటాయించాల్సిన కృష్ణ బేసిన్ నుంచి ఉత్పత్తవుతున్న విద్యుత్ ను కేటాయించలేదని తెలంగాణ సర్కార్ గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పుటు చెరింది. ఈ క్రమంలో కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందాన్ని కుదిర్చారు. అయితే ఆ విద్యుత్ కు సంబంధించిన బకాయిలు తెలంగాణ ప్రభుత్వం తీర్చకపోవడంతో ఇప్పుడదే తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీకి కారణం కానుంది.
బకాయిలు చెల్లించని పక్షంలో తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని ఏపీ జెన్కో అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించిన రూ.4,282 కోట్ల బిల్లులను తక్షణమే చెల్లించకపోతే రాష్ట్రానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని తేల్చి చెప్పింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని జెన్కో విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం విద్యుత్ కేటాయింపులు చేశారు. తెలంగాణలోని ప్రాజెక్టుల నుంచి ఏపీకి 46.11 శాతం.. ఏపీలోని ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 53.11 శాతం విద్యుత్ సరఫరా జరుగుతోంది. విభజన చట్టం ప్రకారం ఏపీ నుంచి తెలంగాణకు 450-300 మెగావాట్ల విద్యుత్ అదనంగా సరఫరా జరుగుతోంది.
పరస్పరం చెల్లించుకోవాల్సిన విద్యుత్ బిల్లులను సర్దుబాటు చేసిన తర్వాత తమ రాష్ట్రానికి రూ. 4,282 కోట్ల బిల్లులను తెలంగాణ చెల్లించాల్సి ఉందని ఏపీ అధికారులు ఎస్ఆర్పీసీలో వాదించారు. ఏపీ వాదనతో విబేధించిన తెలంగాణ అధికారులు బిల్లుల సర్దుబాటు తర్వాత ఏపీ నుంచే తమ రాష్ట్రానికి రూ.2,406 కోట్లు రావాలని తేల్చి చెప్పారు. దీంతో మరోమారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పవర్ పంచాయితీకి తెరలేవనుందిని తెలలుస్తుంది.
ఏపీ నుంచి యూనిట్ రూ.5కు పైగా చెల్లించి విద్యుత్ కొంటూ తిరిగి ఆ రాష్ట్రానికి రూ.4కు యూనిట్ చొప్పున ఇస్తున్నాం. ఏపీ నుంచి అదనంగా 300 మెగావాట్ల మాత్రమే వస్తోంది. ఆపేస్తే మాకు లాభమేనని తెలంగాణ ట్రాన్స్కో వర్గాలు పేర్కొన్నాయి. పరస్పర విద్యుత్ పంపకాలకు సంబంధించి ఏపీ అధికారులు తప్పుడు వాదనలు వినిపిస్తున్నారన్నారు. టీఎస్ఎస్పీడీసీఎల్ నుంచి వేరుపడిన కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన ఆర్ఈసీ రుణ బకాయిలు, ఏపీ పెన్షనర్లకు చెల్లించిన పెన్షన్ల మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉందన్నారు. విద్యుత్ బిల్లుల బకాయిలు, పెన్షన్లు, రుణాలను సర్దుబాటు చేసిన తర్వాత ఏపీ నుంచితెలంగాణకు రూ.2,406 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more