అమృతం తాగిన వాళ్లు దేవతలు, దేవుళ్లు, అది కన్నబిడ్డలకు పంచేవాళ్లు అమ్మానాన్నలు అంటూ తెలుగు సినీకవులు దేవుళ్ల కన్నా అమ్మానాన్నలే గొప్ప, వారి బిడ్డల పట్ల చూపించే అమితాసక్తి, ప్రేమ, అప్యాయత, అనురాగం, కరుణ అన్ని కూడా వెల కట్టలేనివని తెలిపాడు, ఇప్పుడంత ఉన్నఫలంగా తల్లిదండ్రుల అంశాన్ని ఎందుకు తీసుకువస్తున్నామంటే.. అందుకు కారణం లేకపోలేదు. ప్రతీ మనిషి తనకు పెళ్లి కాగానే భార్య పిల్లల కోసం శ్రమించడం అలవాటు చేసుకుంటాడు. ఈ క్రమంలో ఉద్యోగం కోసమో, లేక అత్తా కొడళ్ల మధ్య వివాదాలు తారాస్థాయికి వెళ్లడం వల్లనో గత్యంతరం లేని పరిస్థితుల్లో తనను కనిపెంచిన అమ్మా నాన్నలను వదిలి వేరు కాపురం పెడుతుంటాడు.
అయితే తల్లిదండ్రులను వదిలి వేరుకాపురం పెట్టాలని ఒక వేళ భార్యలు డిమాండ్ చేసిన పక్షంలో కన్నవారిని వదిలి రాలేక మనోవేధన చెందే భర్తలకు ఇప్పుడిక న్యాయ సహకారం కూడా లభించనుంది. గతంలో భర్తగా భార్యకు న్యాయం చేయాలన్న చట్టం అండ చూసుకుని భార్యమణులు వేరు కాపురానికి భర్తలను ఉసిగోల్పేవారు. కానీ అలాంటి పరిస్థితుల నుంచి ఉపశమనం ఇస్తూ.. భార్యలు తమ భర్తలతో బలవంతంగా వేరు కాపురం పెట్టించేందుకు ఒత్తిడి తీసుకువచ్చిన క్రమంలో ఆమెకు విడాకులు ఇవవచ్చని సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
‘హిందూ సమాజంలో తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడటం కుమారుడి ధర్మం. ఇది సర్వసాధారణ ప్రక్రియ’ అని తెలిపింది. భర్తను ఆయన తల్లి దండ్రుల నుంచి వేరు చేయాలని భార్య ప్రయత్నించడం ‘క్రూరత్వమే’ అని, అలాంటప్పుడు విడాకులు కోరవచ్చని తెలిపింది. జస్టిస్ ఏఆర్.దవే, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కేసులో ఈ తీర్పు చెప్పింది. ‘కిందికోర్టు అతనికి ఇచ్చిన విడాకులు చెల్లవు’ అంటూ 2001లో కర్ణాటక హైకోర్టు చెప్పిన తీర్పును సుప్రీం ధర్మాసనం పక్కనపెట్టింది.
‘‘వేరుకాపురం పెడదామని భార్య కోరితే... తగిన కారణం ఉండి తీరాలి’’ అని ధర్మాసనం తెలిపింది. కని, పెంచి, చదివించిన తల్లిదండ్రుల బాగోగులను చూడటం కుమారుడి నైతిక, చట్టపర బాధ్యత అని పేర్కొంది. ‘మనం వేరుగా ఉందాం’ అనడం మన సంస్కృతికి, విలువలకు దూరం కావడమేనని, అది పాశ్చాత్య ధోరణి అని తెలిపింది. అంతేకాదు ఈ తరహా కేసులతో భర్తలకు దూరమైన భార్యలకు వారి భర్త నుంచి పరిహారం కోరే హక్కు కూడా లేదని స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more