కాన్పూర్ వేదికగా కొనసాగుతున్న చారిత్రక 500వ టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. ఆరు వికెట్లతో అశ్విన్ దూకుడు చూపించడంతో కివీస్ 236 పరుగులకు అలౌట్ అయ్యి భారత్ కు అపూర్వ విక్టరీని అందించింది. భారత్ నిర్దేశించిన 434 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా, న్యూజిలాండ్పై 197 పరుగుల భారీ తేడాతో టీమిండియా గెలిచింది.
ఆఖరి రోజు ఆటలో గెలిచే అవకాశాలు నామమాత్రంగా ఉన్న వేళ, కనీసం జిడ్డు ఆట ఆడుతూ డ్రాతో గట్టెక్కాలని చూస్తున్న న్యూజిలాండ్ కు జడేజా షాకిచ్చాడు. 120 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 80 పరుగులు చేసి భారత బౌలర్లకు సవాల్ గా నిలిచిన రోంచీని పెవీలియన్ దారి పట్టించాడు. ఆపై 194 పరుగుల వద్ద వాట్లింగ్, 196 పరుగుల వద్ద క్రెయిగ్ లు పెవీలియన్ చేరారు. వీరిద్దరి వికెట్లనూ మహమ్మద్ షమీ రెండు వరుస బంతుల్లో తీయడం గమనార్హం. 68వ ఓవర్ ఆఖరిబంతికి వాట్లింగ్ ను బోల్తా కొట్టించిన షమీ, 70వ ఓవర్ తొలి బంతికి క్రెయిగ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ స్వల్ప వ్యవధిలో మూడు కీలక వికెట్లను కోల్పోయినట్లయింది. ఇక చివర్లో అశ్విన్ మాయాజాలంతో టీమిండియా ఖాతాలో విజయం వచ్చి చేరింది.
తొలి ఇన్నింగ్స్లో 318, రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 377 పరుగులు సాధించిన టీమిండియా, కివీస్ ను 262, 236 పరుగులకు కట్టడి చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్లో మరో ఆరు వికెట్లు తీసి మ్యాచ్లో పది వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక మ్యాచ్లో పది వికెట్లు తీయడం అతనికిది ఐదోసారి. కాగా, ఇండియా ఆడిన 500 టెస్టుల్లో ఇది 130వ విజయం. భారత్ లో 88వ విజయం కాగా, న్యూజిలాండ్ పై 19వ విజయం. ఈ విజయంతో మూడు టెస్ట్ల పేటీఎం సిరీస్ లో టీమిండియాకు 1-0 ఆధిక్యం లభించడమే కాకుండా ప్రతిష్టాత్మక విజయం సొంతమైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more