కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కావేరి కారు చిచ్చుపై ప్రధాని నరేంద్ర మోదీ కాసేపటి క్రితం స్పందించారు. ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు తనను కలిచివేశాయని అంటున్నారు. హింసతో ఏ సమస్యలు పరిష్కారం కావని ఆయన ఆందోళనకారులకు పిలుపునిచ్చారు. వివాదాల సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. హింసతో సమస్యలు మరింత జటిలమవుతాయని ఆయన పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, కావేరీ జల సమస్య కూడా చర్చలతో పరిష్కారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భావోద్వేగాలకు గురి కాకుండా ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.
చట్టాన్ని అతిక్రమించి ముందుకెళ్లడం మంచి పద్ధతి కాదని, దాడులతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని కోరారు. రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించడం వల్ల సమస్య పరిష్కారం కాదని ఆయన సూచించారు. దేశ సమైక్యత కోసం పాటు పడే బాధ్యత గల పౌరులుగా ప్రజలు నడుచుకోవాలని మోదీ అన్నారు. సమస్య పరిష్కారానికి హింస మార్గం కాదని సూచించిన ఆయన.. చర్చలతోనే సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరి నీటి వివాదం సున్నిత అంశమని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాన్ని న్యాయపరంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
కాగా, ప్రస్తుతం బెంగళూరులోని 16 పోలీస్ స్టేషన్లలో కర్ఫ్యూ విధించారు. దీంతో నగరంలో అప్రకటిత బంద్ కొనసాగుతోంది. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాండ్యాలో ఈనెల 17 వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. కర్ణాటక పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. పది కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కర్ణాటకకు పంపించింది. జలవివాదంపై చర్చించేందుకు కర్ణాటక కేబినెట్ అత్యవసరంగా సమావేశం అవుతోంది. తమిళుల ప్రాణాలు, ఆస్తులు కాపాడాలంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దంటూ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more