విదేశాలలో ముఖ్యంగా అమెరికాలోని విశ్వవిద్యాలయంలో ఆయన ఆర్థిక ప్రోఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారని.. వారితో సన్నిహితంగా మెలుగుతున్నారని.. అమెరికా పౌరసత్వం కూడా వుండటంతో ఆయనకు అర్బీఐ గవర్నర్ గా విధులు నిర్వహించే హక్కే లేదని బీజేపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి అరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే అదే పదవికి ఏకంగా విదేశాలలోనే జన్మించిన ప్రస్తుత అర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను నియమించడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
రఘురామ్ రాజన్ అమెరికా పౌరసత్వమున్న వ్యక్తని అరోపణలు గుప్పించిన సుబ్రహ్మణ్యస్వామి ఉర్జిత్ పటేల్ ను విదేశీ అని విమర్శించడం మూర్ఖత్వమని నెట్ జనులను అడిపోసుకుంటున్నాడు. రఘురామ్ రాజన్ విషయంలో ఒకలా.. కొత్త గవర్నర్గా నియమితులైన ఉర్జిత్ పటేల్ విషయంలో మరోలా ప్రతిస్పందించడం సుబ్రహ్మణ్యస్వామి చాకచక్యమా..? లేక కేంద్రం అయనను అడ్డుగా పెట్టుని ఇలా ఉర్జిత్ పటేల్ పై నెట్ జనులు నుంచి విమర్శలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తుందా..? అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
కెన్యాలో పుట్టినందుకు ఉర్జిత్ పటేల్ను ఎవరైనా విమర్శిస్తే.. అంతకంటే మూర్ఖత్వం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన కెన్యా పౌరుడు ఒకప్పుడు మాత్రమే ఇప్పుడు కాదు. కానీ ఆర్3 (రఘురాం రాజన్) మాత్రం భారత్లో పుట్టి, అమెరికా గ్రీన్ కార్డు మీద కొనసాగుతున్నారు. 2007 నుంచి భారత్లోనే ఉంటున్నా.. దానిని వదులుకోవడం లేదు' అని స్వామి ట్విట్టర్లో విమర్శించారు. రఘురాం అనగానే విమర్శలతో ఒంటికాలిపై లేచే స్వామి.. ఆయనను ఉద్దేశించి 'ఆర్3' అంటూ విమర్శలు గుప్పించారు. ఆయన అమెరికా అనుకూలుడంటూ దుయ్యబట్టారు. అయినవారికి అకుల్లో పెట్టి, కానీ వారికి కంచాల్లో పేట్టడం మన రాజకీయ నాయకులకు బాగా తెలుసిన విషయమని ఈ అంశంలో రుజువైందన్న విమర్శలు వినబడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more