సొంత రాష్ట్రంతోనే అభివృద్ధి అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంకు భవిష్యత్తులో ఆర్థిక చిక్కులు తప్పవా? రానున్న మూడేళ్లలో లోటు బడ్జెట్ లోకి చేరిపోనుందా? అసలు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి పైకి కనిపిస్తున్నట్లు నిజంగానే ఘనంగా ఉందా? పూర్తి ఆర్థిక నివేదికలను పరిశీలిస్తే అదంతా జరగబోతుందనే చెప్పొచ్చు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్నీ కష్టాలే మొదలౌతున్నాయని ఆర్థిక నిపుణులు లెక్కలేసి మరీ చెబుతున్నారు.
ఈ మధ్య కష్టాలు, తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని మూసేద్దామని బెదిరించి, ఆపై ఎలాగైనా బతికించుకుందామని ముఖ్యమంత్రి అధికారులతో వ్యాఖ్యానించడం, అందుకు తగ్గట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం తెలిసిందే. ఇది గడిచి నెల దాటుతున్న పరిస్థితి ఏ మాత్రం మారలేదని లెక్కలు చెబుతున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణ ఆర్టీసీ రూ. 900 కోట్ల మేరకు నష్టాలను భరించాల్సి వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేతనాలు పెరగడం, అలవెన్సుల భారానికి తోడు, పాత రుణాలపై కట్టాల్సిన వడ్డీలు పెనుభారం కాగా, మరో 8 నెలలు మిగిలి ఉండగానే నష్ట స్థాయిపై అంచనాలను లెక్క తేల్చారు.
ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావు, ఇతర అధికారులు సంస్థ పరిస్థితిని సమీక్షించి, ఉమ్మడి రాష్ట్రంలో నష్టాల కన్నా, విడిపోయిన తరువాత టీఎస్ ఆర్టీసీ నష్టం ఎక్కువగా ఉండనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆర్టీసీ ఉన్న సమయంలో 2013-14లో అత్యధికంగా రూ. 908 కోట్ల మేరకు నష్టాన్ని ఆర్టీసీ భరించిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క విభాగంలోనే కాదు... దాదాపు అన్ని శాఖలలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు అంటున్నారు. మిగులు బడ్జెట్ తో మొదలైన తెలంగాణ ఆర్థిక పరిస్థితి రెండేళ్లకే ఇలా అయితే. రానున్న రోజుల్లో ఇది ముదిరితే మాత్రం ఆర్థిక చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more