ముంబైకి చెందిన జకీర్ నాయక్ ఒక లెక్చరర్. కాలేజీలో విద్యార్థులకు పాఠాలు చెప్పిన అనుభవం ఉంది. అంతేకాదు ఇస్లాం గురించి సుమారు 4 వేలకు పైగా ఉపన్యాసాలు ఇచ్చాడు. అందుకోసం తన చానెల్ ను వాడుకున్నాడు. పేరుకు పీస్ చానెల్ అయినప్పటికీ అందులో ఆయన చేసినవన్నీ ఉద్రేకపూరిత ఉపన్యాసాలే. దీంతో రెచ్చిపోతున్న యువత ఉగ్రవాదులుగా మారిపోతున్నారు. తాజాగా బంగ్లాదేశ్ లో జరిగిన నరమేధానికి ఇతగాడి ఉపన్యాసాలే కారణమని తెలియటంతో యావత్ ప్రపంచం షాక్ కి గురయ్యింది.
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్)లో చేరాలనుకునే యువకులకు 50 ఏళ్ల ఈ ఇస్లాం బోధకుడి పాఠాలే ఇన్సిఫిరేషన్ గా నిలుస్తున్నాయంట. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారుల విచారణలో ఈ విషయాలన్నీ వెలుగు చూస్తున్నాయి. మహారాష్ట్ర లోని కళ్యాణ్కు చెందిన నలుగురు యువకులకు కూడా జకీర్ ప్రసంగాలే స్ఫూర్తినిచ్చినట్టు తెలుస్తోంది. నలుగురిలో ఒకరైన అరీబ్ మజీద్ను గతేడాది ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ సందర్భంలో తనకు జకీర్ ప్రసంగాలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని విచారణలో అతను తెలిపాడు.
అలాగే 2010-11లో బిహార్లోని దర్భంగాలో పోలీసులు ఇండియన్ ముజాహిదీన్ మాడ్యూల్ గుట్టును రట్టుచేశారు. ఆ సమయంలో పోలీసులు జకీర్ ప్రసంగాల సీడీలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. దీంతో జకీర్పై ఓ కన్నేసిన ప్రభుత్వం అతని ‘పీస్’ టీవీ చానల్పై నిషేధం విధించింది. ఇక హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ విషయంలో స్వయంగా జోక్యం చేసుకుంటున్నాడు. జకీర్ ప్రసంగ సీడీలను పరిశీలించడంతోపాటు జకీర్ పై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చిస్తున్నారు.
కాగా, జకీర్ తో గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ వేదిక పంచుకోవటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఆ సమయంలో ప్రపంచ శాంతి పేరుతో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారే తప్ప వ్యక్తిగతంగా జకీర్ తో డిగ్గీరాజాకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ చెబుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more