నేర చరిత లేని నేతలతో సుభిక్షమైన పాలన అందిస్తానని ఎన్నికల సమయంలో వాగ్ధానం చేసిన మోదీ ఆ మాటను నిలుపుకోలేకపోతున్నారా? తాజాగా జరిగిన మంత్రి వర్గ విస్తరణను చూస్తే అవుననే వాదన వినిపిస్తోంది.
ఈ మేరకు ప్రముఖ ఓ ప్రముఖ దిన పత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. మొత్తం 78 మందిలో 24 మంది (31 శాతం) మంది నేర చరితులేనట. మొన్న మరో 19 మందిని తన కేబినెట్ లోకి చేర్చుకోవటం ద్వారా ఆ సంఖ్యను పెంచుకున్నారు మోదీ. అయితే వీరిలో కూడా తక్కువ తిన్నవారు ఎవరూ లేరని తెలుస్తోంది. అనుప్రియ సింగ్ పాటిల్, రమేష్ జిఘాజినాగి, ఫగ్గాన్ సింగ్ కులస్తే, విజయ్ గోయల్, రాజెన్ గోహైన్, రాందాస్ అత్వాలే, అక్బర్ వీరందరిపై తీవ్ర స్థాయి కేసులే నమోదైనట్లు పేర్కొంది.
మొత్తం మంత్రుల్లో 14 మందిపై అత్యాచారం, హత్యాయత్నం, సామాజిక అల్లర్లు, ఎన్నికల నియమావళి ఉల్లంఘన తదితర తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులు వివిధ కోర్టులలో పెండింగ్ లోనే ఉన్నాయట. ఇక ఇలా నేరచరితులుగా వినుతికెక్కిన ఈ మంత్రులంతా కోటీశ్వరులేనని కూడా ఆ కథనం పేర్కొంది.
అలాగే ప్రస్తుతం కొలువుదీరిన కేబినెట్ కోటీశ్వరులకు నిలయంగా ఉందని తెలిపింది. ఉన్న మంత్రుల్లో 72 మంది మంత్రులు కోటీశ్వరులేనంట. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అందరికంటే ఎక్కువగా రూ.113 కోట్ల ఆస్తిని కలిగి ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్ స్మిత్ కౌర్ బాదల్ రూ.108 కోట్లు, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ రూ.95 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు.
ఇక కొత్త మంత్రుల్లో మధ్యప్రదేశ్ కు చెందిన ఎంపీ, ఎంజే అక్బర్ రూ.44.90 కోట్లు, రాజస్థాన్ కు చెందిన ఎంపీలు పీపీ చౌదరి రూ.35.35 కోట్లు, విజయ్ గోయల్ రూ.29.97 కోట్లు ఆస్తి ఉన్నట్లు ప్రకటించారు. కోటి కన్నా తక్కువ ఆస్తులు ఉన్న కేంద్రమంత్రులు ఆరుగురు కాగా, వారిలో మధ్యప్రదేశ్ కు చెందిన ఎంపీ అనిల్ మాధవ్ దవేకు అందరికంటే తక్కువగా రూ.60.97 లక్షల ఆస్తితో పేద మంత్రిగా ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more