సభ్య సమాజంలో సిగ్గుతో తలదించుకునే ఘటనలకు దేశ రాజధాని ఢిల్లీతో పాటు జంగిల్ రాజ్ గా ముద్రపడిన ఉత్తర్ ప్రదేశ్ లో సర్వసాధారణంగా మారుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ అత్యాచారాలపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ దేశానికే కాదు అత్యాచారాలకు కూడా రాజధానిగా మారుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా అక్కడి పరిస్థితి మార్పులో ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న అరోపణలు కూడా గుప్పుమంటున్నాయి.
తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో దారుణం జరిగింది. ఉన్నత విద్యతో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన స్కూల్ డైరెక్టరే కామాంధుడిగా మారాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మంది విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేశాడు. తాన మాటలను విని లొంగని పక్షంలో పరీక్షలలో ఫెయిల్ చేస్తానని భయపెట్టి వారిని లోబర్చుకుని.. తండ్రి, గురువు స్థానంలో వున్న పైశాచిక మృగం కామావాంఛ తీర్చుకుంది. విషయం బయటకు పొక్కడంతో పాఠశాల డైరెక్టర్ జితేందర్ సింగ్ యాదవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఓ 15 ఏళ్ల బాలికను తాను చెప్పినట్టు వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి లోబర్చుకున్నాడు.
ఆమె బతిమాలినా వినకుండా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆ కామాంధుడి అహం చల్లారలేదు. ఆమెతో గడిపిన వీడియోను వాట్సాప్లో పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాడు. దాదాపు సంవత్సరం నుంచి తనను బలవంతంగా అనుభవిస్తున్నాడని ఆ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. తాను చెప్పినట్లు రాకపోతే వీడియోను నెట్లో పెడతానని బెదిరించేవాడని ఆమె తెలిపింది. అతని ఉచ్చులో చిక్కుకుని 20 మందికి పైగా బాలికలు నరకం అనుభవిస్తున్నారని ఆ బాలిక చెప్పింది. నిందితుడు బగ్వాలా ప్రాంతంలోని శ్రీ కృష్ణా సెకండరీ స్కూల్ డైరెక్టర్గా పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more