ఇది నిజంగా తీపి కబురే. వందలు, వేలు పెట్టి మందులు కోనుగోలు చేసే వారికి అత్యంత చౌవకైన ధరకు అవి లభిస్తున్నాయంటూ ఒకింత ఆనందమే. చక్కర వ్యాధి అనగానే అప్పటి వరకు ఎంతటి ధైర్యంగా వున్నవారైనా.. క్రమంగా మనోధైర్యాన్ని కోల్పోతుంటారు. దీనికి రెండు కారణాలు ఒకటి వారికి వచ్చిన షుగర్ వ్యాధి వారిని బాధిస్తుండగా, ఆ వ్యాధిని నయం చేసేందుకు వందలు, వేల రూపాయలతో మందులు కోనుగోలు చేయడంతో వారిని అర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది.
దీంతో మధుమేహం వ్యాధి బారిన పడిన రోగులు అంతకంతకూ తమలో తాము క్షీణిస్తుంటారు. కాగా, అలాంటి వారికి నిజంగా తీపి కబరును అందించి.. అత్యంత చౌవకైన ధరకు అయుర్వేద మందులను అందిస్తామంటున్నారు శాస్త్రవేత్తలు. టైప్-2 మధుమేహ వ్యాధి చికిత్స కోసం శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధక మండలి(సీఎస్ఐఆర్) సోమవారం కొత్తగా ఆయుర్వేదిక్ యాంటీబయోటిక్ ఔషధం బీజీఆర్-34ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ ఔషధం రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రణలో ఉంచి, శరీరంపై ఇతర ఔషధాల దుష్ర్పభాలను తగ్గింస్తుందని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్బీఆర్ఐ) శాస్త్రవేత్త ఏకేఎస్ రావత్ తెలిపారు. లక్నోలోని ఎన్బీఆర్ఐ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడిసినల్, అరోమాటిక్ ప్లాంట్స్(సీఐఎంఏపీ) సంస్థలు సంయుక్తంగా ఈ ఔషధాన్ని అభివృద్ధిచేశాయి. కర్ణాటక సహా సరిహద్దు రాష్ట్రాలో 5 రూపాయలకే దీన్ని ఆయుర్వేదిక్ ఫార్మా సంస్థ ఏఐఎంఐఎల్ ముందుకు వచ్చింది. కస్తూరి పసుపు, ఏగిస, తిప్పతీగ, మంజిష్ట, పొడపత్రి, మెంతులు తదితరాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ ఔషధాన్ని తయారుచేశారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more