mudragada pabmanabham health condition detoriates as his hunger stirke reaches sixth day

Mudragada pabmanabham hunger strike reaches sixth day

mudragada hunger strike, mudragada padmanabham, hunger strike in hospital, hunger strike, kapu reservation stir, kapu garjana, chandrababu naidu, kapu leaders, hunger strike, pesticide, tuni violence, mudragada padmanabham, amalapuram one town police station, Mudragada fast unto death, mudragada hunger strike

Kapu caste leader Mudragada padmanbham says he wont break his fast untill the government comes forward to fullfill eleection promises amid his health condition detoriates on sixth day.

క్షీణిస్తున్న ముద్రగడ అరోగ్యం.. అరోవ రోజుకు అమరణ దీక్ష

Posted: 06/14/2016 08:34 AM IST
Mudragada pabmanabham hunger strike reaches sixth day

కాపు కులస్థులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని, వారిపై అక్రమంగా బనాయించిన కేసులు, రౌడీషీట్లు తక్షణం ఎత్తివేయాలని, తుని రైలు దహనం ఘటనను సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. కాపు హక్కుల ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన అమరణ దీక్షను అరవ రోజుకు చేరుకుంది. రాజమండ్రి అస్పత్రిలో వైద్యానికి నిరాకరిస్తూ ముద్రగడ దీక్ష చేయడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందని వైద్యులు తెలిపారు. ముద్రగడ తక్షణం వైద్య సాయం తీసుకోవాలని వారు తెలిపారు.

అయితే బలవంతంగా ఆయనకు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు వైద్యులు ప్రయత్నించినా.. ఆయన దానిని తిప్పికోట్టారు. కనీసం మంచి నీళ్లైనా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నా వాటిని ఆయన లక్ష్య పెట్టడం లేదు. ప్రభుత్వం తనను మానసికంగా వేధిస్తోందని, హామీలను నెరవేర్చే వరకూ తాను చేపట్టిన అమరణ దీక్ష విరమించేది లేదని ముద్రగడ పద్మనాభం తాజాగా ప్రభుత్వానికి తేల్చిచెప్పినట్లు సమాచారం. మరోవైపు ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వంలో కనీసం చలనం లేకపోవడం పట్ల కాపులు మండిపడుతున్నారు. ముద్రగడ ఆరోగ్యం విషమిస్తోందనే విషయం తెలియడంతో ఆందోళనకు గురైన అమలాపురానికి చెందిన సాధనాల బాలాజీ(30) గుండెపోటుతో మృతిచెందాడు.

ముద్రగడ పద్మనాభం అరెస్టును నిరసిస్తూ సోమవారం పలు జిల్లాల్లో కాపులు ఆందోళన చేపట్టారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయాల ఎదుట బైఠాయించారు. అధికారులకు వినపత్రాలు సమర్పించారు. ముద్రగడ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అంధోళన కార్యక్రమాలను చేపట్టారు. తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు దహనం కేసును సిబీఐకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు అయన నాలుగు రోజులుగా దీక్ష చేస్తుంటే.. ప్రభుత్వం తమ కులస్థుల ఐక్యతను విచ్చిన్నం చేయడానికి కుట్రలు చేస్తుందని కాపు నేతలు విమర్శించారు. ముందుగా ముద్రగడ పద్మనాభం పెట్టిన అన్ని డిమాండ్లు నెరవేర్చే దాకా, తమ కులస్థులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరంచుకునేదాకా ముద్రగడ దీక్ష విరమించరని కాపుల నేతలు తేల్చి చెబుతున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles