వడ్డించే వాడు మనవాడైతే.. ఏ మూలన కూర్చుంటే మాత్రం నష్టమేమిటీ అన్న రీతిలో మహారాష్ట్రకు చెందిర ఒక మహిళా ఎంపీ కోసం స్వయంగా రైల్వే శాఖ మంత్రి అదేశాల మేరకు ప్రత్యేక రైలు నడిపించడం వివాదాస్పదంగా మారింది. అయితే అదేశాలు కేవలం మౌకికం మాత్రంమే కావడం గమనార్హం. మహారాష్ట్ర బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ కోసం భారత రైల్వే స్పెషల్ గా మహారాష్ట్ర లోని బినా నుంచి భోపాల్ కు రైలును నడపడం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. భోపాల్ కు చేరుకొని అక్కడి నుంచి పూనమ్ ముంబైకి ఫ్లైటులో వెళ్లాల్సివుంది
ముంబైలో రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా కార్యక్రమానికి ఆమె హాజరు కావాల్సివుండగా, ఆమె బినాకు చేరుకునే లోపే భోపాల్ కు వెళ్లాల్సిన రైలు వెళ్లిపోయింది. దీంతో బోపాల్ శివార్లలోని బీనా జిల్లా పరిధిలని సుఖీ సేవాన్య స్టేషన్ నుంచి బోపాల్ వరకు నడిపారు. సుమారు తొంబై నిమిషాల నిడివి గల ఈ ప్రయానం కోసం అమెకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ప్రత్యేక రైలులో భోపాల్ చేరుకున్న పూనమ్ అక్కడి నుంచి విమానంలో ముంబైకి చేరుకున్నారు. షెడ్యూల్లో లేని రైలు వల్ల పలు రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది.
కాగా బీజేపి ఎంపీ పూనమ్ మహాజన్ కోసం ప్రత్యేక రైలు నడిపారన్న వార్తలను రైల్వే శాఖ అధికారులు తోసిపుచ్చారు. పశ్చిమ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ రమేష్ చంద్ర ఈ విషయమై స్పందిస్తూ.. ఎంపీల కోసం ప్రత్యేకంగా రైలు నడపాలని నిబంధనలు లేవని నిబంధలను తాము ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించలేదని అన్నారు. బీజేపి ఎంపీకి ఎలాంటి ప్రత్యేక ట్రీట్ మెంట్ ఇవ్వలేదని ఆయన చెప్పారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి మనోజ్ సిన్హా కోసం సాగర్ జిల్లా నుంచి బోపాల్ కు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశామని, కాకతాలీయంగా ఆ రైలులో ఎంపీ కూడా ఎక్కడరని జనరల్ మేనేజర్ చెప్పారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more