Death came to a person in the Bus

Death came to a person in the bus

Hyderabad, Death, Dead, Eeshwar Rao

A Bus who sat in a bus, accudentally death. A Bus dash another bus in this incident a person spot dead.

బస్సులోకి వచ్చిన చావు

Posted: 03/22/2016 09:46 AM IST
Death came to a person in the bus

మృత్యువును ఎవరూ తప్పించలేరంటే ఇదే.. ఆర్టీసీ బస్సులో కులాసాగా కూర్చున్న ఆ యువకుడు మరికొద్ది సేపట్లో ఇంటికి వెళతాను.. రేపు ఇది చేయాలి.. అది చేయాలని ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఆ ఆలోచనలు అలా ఉండగానే.. గిలగిల కొట్టుకుంటూ ప్రాణం కోల్పోయాడు. ఈ దారుణం సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో రవీంద్రభారతి సమీపంలో జరిగింది. ఆర్టీసీ బస్సులో కూర్చొని ప్రయాణిస్తున్న ఆ యువకుడికి ఊహించని విధంగా పక్క బస్సు రాడ్ కిటికీలోంచి దూసుకొచ్చి గొంతులో గుచ్చుకుంది. దీంతో యువకుడు బస్సులోనే గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలొదిలాడు. ఆ యువకుడిది ప్రకాశం జిల్లా కనిగిరి. పేరు వి.ఈశ్వర్‌రావు. వయస్సు 23 ఏళ్లు.  కొండాపూర్‌లోని కిమ్స్ హాస్పిటల్ క్యాంటీన్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి అంబర్‌పేట్‌లో నివాసం ఉంటున్నాడు.

డ్యూటీ అయిపోగానే..  కోఠీ వెళ్లే 127K (AP28Z0547) బస్సులో బయల్దేరాడు. రవీంద్రభారతి సిగ్నల్ దగ్గర… పక్కనే ఉన్న మరో మెట్రో బస్సును ఓవర్‌టేక్ చేస్తూ బస్సు ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో మెట్రో బస్సు అద్దాల దగ్గర ఉన్న ఇనుప రాడ్డు 127కే బస్సు చివర అద్దానికి తగిలి.. నేరుగా లోపలికి దూసుకొచ్చింది. బస్సు వెనుక సీట్లో కిటికీ దగ్గర కూర్చున్న ఈశ్వర్‌రావు గొంతులోకి దిగింది. దీంతో ఈశ్వర్‌రావు అక్కడికక్కడే చనిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అక్కడి వారు షాక్ గురయ్యారు. అప్పటి వరకు తమతో కూర్చున్నవాడు ఇలా ప్రాణాలు వదలడంతో నిశ్చేష్టులయ్యారు. ఈ ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ శ్రీనివాసులు అక్కడ్నుంచి పరారయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Death  Dead  Eeshwar Rao  Bus  

Other Articles