హైదరాబాద్ లోని ముగ్గురు డాక్టర్ల కాల్పుల స్టోరీ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కాల్పుల్లో మరణించిన శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ భావిస్తే... తన భర్తది ఆత్మహత్య కాదు వైద్యులు సాయికుమార్, ఉదయ్ కుమార్ లు కలిసి హత్య చేసారంటూ శశికుమార్ భార్య క్రాంతి ఆరోపిస్తున్నారు. అయితే ఈ మరణం వెనుక వున్న వ్యక్తులు, అసలు కథ ఏంటని పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ కేసులో భాగంగా చంద్రకళ అనే మహిళ పేరు బయటకొచ్చింది. అసలు ఈ చంద్రకళ ఎవరు? ఆమెకు శశికుమార్ కు వున్న సంబంధం ఏంటి? శశికుమార్ చావుకు చంద్రకళకు ఏమైనా సంబంధాలు వున్నాయా అనే వైపుగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే పోలీసుల విచారణలో చంద్రకళ గురించి కొన్ని విషయాలు బయటకొచ్చాయి.
అవెంటంటే... డాక్టర్ శశికుమార్ కు చంద్రకళ ఫ్యామిలీ ఫ్రెండ్. ఆమె భర్త కల్నల్గా పని చేస్తూ ఆరు నెలల కిందట మరణించినట్లుగా తెలిసింది. ఆమె ఖైరతాబాద్లో వుంటున్నారు. అయితే శశికుమార్ ను చంద్రకళ తన ఫాం హౌస్ లో విడిచిపెట్టేసి, అక్కడ పనిచేసే వాచ్ మెన్ శంకరయ్యను తనతో పాటు తీసుకెళ్లి, శశికుమార్ కు భోజనం తీసుకెళ్లమని చెప్పిందని ఫాం హౌస్ లో పనిచేసే వ్యక్తి చెబుతున్నాడు. ఆ తర్వాత సుసైడ్ కు ముందు శంకరయ్య నుంచి ఫోన్ వచ్చిందని... దాదాపు పదినిమిషాలు శశికుమార్ తనతో మాట్లాడినట్లుగా చంద్రకళ చెప్పుకొచ్చినట్లుగా తెలిసింది.
అయితే తాను చనిపోతున్నానని, తనను కాపాడుకునే ప్రయత్నం చేయవద్దంటూ ఫోన్ కట్ చేసాడని చంద్రకళ తెలిపింది. ఆ తర్వాత చంద్రకళ నారాయణగూడ పోలీసులకు తెలిపి, వాళ్లతో కలిసి ఫాం హౌస్ కు వెళ్లేసరికి శశికుమార్ చనిపోయి వున్నాడని తెలిపినట్లుగా తెలిసింది. అయితే శశికుమార్ చనిపోయే ముందు చంద్రకళతో ఏం మాట్లాడారు? అలాగే ఈ కేసులో ప్రియాంక అనే మరో మహిళ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు విషయంలో పోలీసులు విచారణ చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more