దేశరాజదాని డిల్లీతో దేశ 29వ రాష్ట్రంగా నూతనంగా అవిర్బవించిన తెలంగాణ పోటీ పడాలని బావిస్తుంది. అయితే అది అభివృద్దిలోనా..? లేక మరెందులోనూ అన్న సందేమం అందరిలోనూ కలగకమానదు. కానీ అభివృద్ది, అవినీతి నిర్మూలన, ఇత్యాదులలో కాకుండా ఢిల్లీ ఎమ్మెల్యేలు పోందుతున్న జీతబెత్యాలతో తెలంగాణ ప్రబుత్వం కూడా పోటీ పడాలని బావిస్తుంది. అంటే మన శాసనసభ, శాసన మండలి సభ్యుల జీతభత్యాలను కూడా అమాంతం రెండు, మూడింతల మేర పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
పెరిగిన ఖర్చులకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్కు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంకు వినతిపత్రాలు సమర్పించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల జీతాలు పెంచిన నేపథ్యంలో తెలంగాణలో కూడా జీతాలు సవరించాలనే అంశంపై ప్రభుత్వం చర్చించింది. ప్రస్తుతం మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, విప్లు, ప్రతిపక్ష నాయకులు కేబినెట్ ర్యాంక్ జీతం పొందుతున్నారు. మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలకు రూ.95 వేల చొప్పున వేతనం తీసుకుంటున్నారు. వీటన్నింటికీ కలిపి ప్రభుత్వం ఏటా రూ.14.94 కోట్లు చెల్లిస్తోంది.
అయితే పెరిగిన ఖర్చుల నేపథ్యంలో వారికి నెల జీతాలు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. సీఎం సమక్షంలో జరిగిన చర్చలో ఎమ్మెల్యేల ఖర్చులు ప్రస్తావనకు వచ్చాయి. ఇటీవల ఢిల్లీ శాసన సభ్యులకు రూ.4 లక్షల వరకు వేతనం ఇవ్వాలని అక్కడి అసెంబ్లీ ప్రతిపాదించిన విషయం కూడా చర్చకు వచ్చింది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులకు చెల్లిస్తున్న జీతభత్యాల వివరాలు తీసుకున్నారు. అన్నీ చర్చించిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు పెంచాలని, అదే నిష్పత్తిలో కేబినెట్ ర్యాంకున్న చట్ట సభల సభ్యుల జీతాలు పెంచే అంశంపైనా కసరత్తు జరిపారు. ఈ నేపథ్యంలో ఏ మేరకు పెంపును సమర్దిస్తూ తుది నిర్ణయం తీసుకుంటారన్నది ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పైనే అధారపడి వుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more