కాల్ మనీ వివాదంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రమేయం ఉన్నట్లు దాదాపుగా తేలిపోయింది. దాంతో ప్రస్తుతం ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు మీద, ఆయన ప్రభుత్వం మీద అన్ని పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాల్మనీ వివాదంపై హైకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుకు ఏ మా త్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రప్రభుత్వం కాకుం డా నేరుగా హైకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిగేలా చూడాలని సూచించారు. చంద్రబాబు అండ చూసుకుని సాగించిన కాల్మనీ రాక్షసకాండకు ఆయనే బాధ్యత వహించాలి అని జగన్ స్పష్టం చేశారు.
చంద్రబాబు ఓటుకు నోటు కేసులో తప్పించుకునేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్ళు పట్టుకొని బైటపడ్దరాని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ తలపెట్టిన మహా చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానించడానికి వచ్చిన తీరు చూస్తే కుమ్మక్కు రాజకీయాలు కనిపిస్తున్నాయన్నారు. చంద్రబాబును నమ్ముకున్న రేవంతరెడ్డి ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళివస్తే, చంద్రబాబు మాత్రం కేసీఆర్ తో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారన్నారు. చంద్రబాబు కేసు నుండి తప్పించుకునేందుకు నమ్ముకున్న రేవంతరెడ్డినే మోసం చేస్తున్నాడన్నారు. కాల్ మనీ కేసులో మొదటి ముద్దాయి ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడే అని కాంగ్రెస్ సీనియర్ నేత తులసీ రెడ్డి ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more