సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ కి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. 2014 జనవరిలో హోటల్ లీలా ప్యాలెస్ గదిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా ఆమె మృతికి గల కారణాలు వెల్లడి కాలేదు కానీ.. పోస్ట్ మార్టం చేసిన ఎయిమ్స్ వైద్యులు విష ప్రయోగం కారణంగానే ఆమె చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
అయితే.. ఏ విష పదార్థం ఇందుకు కారణమన్న విషయాన్ని తేల్చేందుకు అవసరమైన ల్యాబ్ వసతులు తమ వద్ద లేవని వారు చెప్పడంతో.. సునంద శరీర భాగాల శాంపిళ్లను అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు పోలీసులు పంపారు. వాటిని సునిశితంగా పరిశీలించిన ఎఫ్ బీఐ అధికారులు బుధవారం ఢిల్లీ పోలీసులకు 8 పేజీల నివేదికను అంజేశారు. పొలోనియం సహా ఇతర రేడియోధార్మిక పదార్థాల కారణంగా సునంద చనిపోలేదని ఆ నివేదికలో ఎఫ్ బీఐ తేల్చిచెప్పింది. దీంతో ఆమె మృతి వెనుక ఉన్న కారణాలను నిగ్గు తేల్చేందుకు ఢిల్లీ పోలీసులు మరోమారు రంగంలోకి దిగక తప్పడం లేదు. ఇందులో భాగంగానే పోలీసులు ఇప్పటికే శశిథరూర్ ని ప్రశ్నించారు.
ఇప్పుడు ఆయనకు సత్యశోధన (నార్కో అనాలసిస్ టెస్ట్) పరీక్షలు నిర్వహిస్తే తప్ప అసలు వాస్తవాలు వెలుగు చూసేలా లేవని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో నార్కో పరీక్షల కోసం థరూర్ కు త్వరలోనే నోటీసులు అందే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నార్కో టెస్టులో మత్తుమందులాంటి ఓ పదార్థాన్ని ఎక్కిస్తారు. అందులో చాలావరకు వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం వుంది. ఈ తరహా టెస్టు ఇదివరకే గతంలో ఆరుషీ తల్వార్ కేసులో భాగంగా వినియోగించడం జరిగింది. ఇదిలావుండగా.. సునంద మృతికి పాక్ రిపోర్టర్ తో శశి సన్నిహితంగా మెలగడమే కారణమన్న అనుమానాలు మరింత బలమవుతున్నట్లు తెలుస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more