మీరు మైనార్టీలు.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డారు కాబట్టి మీ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం.. మీ అభివృద్ది కోసం తెలంగాణ రాష్ట్రంలో 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం అంటూ కేసీఆర్ ఎన్నికలకు ముందు హామీలిచ్చారు. కానీ వాటిని అమలు చెయ్యడంలో మాత్రం వెనకడుగువేస్తున్నారు. తాజాగా కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి అడ్డులు లేకుండా అధికారంలొ కొనసాగుతోంది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల గురించి మాత్రం మరిచిపోయారు. ఎన్నికలకు ముందు ఓటు బ్యాంకు రాజకీయాలకు కేసీఆర్ మాత్రం అతీతం కాదు. అందుకే ఎన్నికలకు ముందు కేసీఆర్ మైనార్టీల గురించి బీభత్సమైన ఉపన్యాసాలు చేశారు. తాము అధికారంలోకి వస్తే అసల్లు దిగులుండదు అన్నట్లు మాట్లాడారు. అందుకే ఎంఐఎం పార్టీ కూడా టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంది. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం ఇచ్చిన హామీలను మరిచిపోతున్నారు కేసీఆర్.
తెలంగాణ ముస్లింలు ఎంతో వెనుకబడి ఉన్నారు. ముస్లింల వెనుకబాటుకు చాలా కారణాలున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా వారికి అన్ని ప్రభుత్వాలు చేయూతనివ్వాలి. అందులో భాగంగానే వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించవచ్చు. రాజ్యాంగం కూడా మైనార్టీల అభివృద్దికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే అవకాశం కల్పించింది. అయితే కేసీఆర్ కూడా ముస్లింలకు తాము అధికారంలోకి వచ్చాక 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచింది కానీ కేసీఆర్ మాత్రం ముస్లింలకు కల్పిస్తానన్న 12శాతం రిజర్వేషన్ మీద దాటివేత ధోరణి అవలంబిస్తున్నారు. ఇస్తానన్న రిజర్వేషన్ల మీద వేసిన కమిటీని మరికొంత కాలం పొడగించారు. మరి ఇదంతా ముస్లింల మీద చిత్తశుద్ది ఉండే చేస్తున్నారా.? మరి కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే ఇలా ముస్లింలకు ఇస్తానన్న రిజర్వేషన్ల మీద మీనమేషాలు లెక్కిస్తారా..? అన్నది ప్రశ్న.
తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి కేసీఆర్ కు సవాలక్ష కారణాలు అడ్డంవస్తున్నాయి. కేసీఆర్ కు గతంలో రిజర్వేషన్ల మీద వేసిన కేసులు అడ్డుగలుతున్నాయట. అయినా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా..? అని ఓ నానుడి ఉంది. రాజు తలుచుకుంటే కొండ మీద కోతైనా దిగిరావాల్సిందే.. మరి కేసీఆర్ కు మాత్రం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి మాత్రం కొరకాని కారణాలు అడ్డం వస్తున్నాయి. అయినా మరోసారి ఎలక్షన్ లు ఉంటే మాత్రం అప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ కు ముస్లింలు గుర్తుకు వస్తారు.. వారికి ఇచ్చిన 12శాతం రిజర్వేషన్ల హామీ కూడా గుర్తుకు వస్తుంది. తాజాగా ముస్లింల స్థితిగతులను అధ్యయనం చెయ్యడానికి వేసిన సుధీర్ కమిటి కాలాన్ని మరో ఆరు నెలలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ప్రస్తుతం తెలంగాణలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గతంలో కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరి 12శాతం రిజర్వేషన్లు ఎన్నటికి అమలువుతాయో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more