నరేంద్రమోదీ ప్రధానిగా ఎన్నికైన తొలినాళ్లలో ఆయన హవా బాగానే కొనసాగింది కానీ.. ఆ తర్వాత విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తడం మొదలయ్యాయి. ఇప్పటికే విపక్ష పార్టీలు తమకు సాధ్యమైనంతవరకు మోదీ మీద విమర్శల వర్షం కురిపిస్తుండగా.. నిన్నటిదాకా జేజేలు కొట్టిన ప్రజలు, మరికొందరు ప్రముఖులు ఆయనపై మండిపాటు వ్యక్తం చేస్తున్నారు. అంతెందుకు.. నిన్నటికి నిన్నే బీజేపీ కురువృద్ధుల్లో ఒకరైన రాంజెఠ్మలానీయే సోషల్ మాధ్యమం వేదికగా మోదీ ఓటమిని చూడాలని వుందని తన అభిప్రాయాన్ని వెల్లడించి మరో సంచలనానికి దారితీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మేనకోడలు, ప్రముఖ రచయిత్రి నయనతార సెహగల్ మోదీపై ధ్వజమెత్తుతూ.. ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాహిత్యరంగంలో జాతీయ పురస్కారమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి కేంద్రానికే పంపుతున్నట్లు మంగళవారం వెల్లడించారు.
నరేంద్ర మోదీ ప్రధానిగా ఎన్నికయినప్పటినుంచి దేశంలో ప్రజాస్వామిక వాతావరణం చెడిపోయిందని, సాంస్కృతిక వైవిధ్యానికి తూట్లుపొడిచే ప్రక్రియ వేగవంతమైందని సెహగల్ విమర్శించారు. అందుకే ఎన్డీఏ తీరుకు నిరసనగా 1986లో లభించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కిస్తున్నట్లు ప్రకటించారు. గతంలోనూ పలుమార్లు మోదీపై విమర్శలు చేసిన నయనతార.. ఈసారి తన అవార్డును వెనక్కి ఇవ్వడంతో అది సాహితీలోకంతోపాటు రాజకీయ రంగంలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమె తీసుకున్న నిర్ణయం ఎన్ని వివాదాలకు తావిస్తుందోనని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇదిలావుండగా... నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ కు రెండో సంతానంగా 1927లో జన్మించిన నయనతార.. దేశంలో పేరెన్నికగల ఆంగ్ల రచయితల్లో ఒకరిగా ఎదిగారు. రాజకీయ మార్పులతో దేశంలో సంభవిస్తోన్న మార్పులను ఆధారంచేసుకుని ఆమె రచించిన పలు పుస్తకాలు విశేష ఆదరణ పొందాయి. ఆమె రాసిన 'రిచ్ లైక్ అజ్' నవలకు 1986లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more