అమ్మాయిలు అర్థరాత్రి దాటాక ఒంటరిగా బయటకు వెళ్లడం, మేలుకుని ఉండడం భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు విరుద్ధమని కేంద్ర సాంస్కృతిక మంత్రి మహేశ్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నెట్ జనులతో పాటుగా మహిళా సంఘాలూ కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. అనాధిగా వస్తున్న భారతీయ సంస్కృతీ సంప్రదాయాల పేరుతో.. ఇంకా ఎన్నాళ్లు మహిళలను బంధిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలను పరిశీలిస్తే.. సతీసహగమనం తరహా మూడాచారాలను ప్రేరేపించేలా వున్నారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇది 2015 అని కనీసం ఇప్పుడైనా మహిళలను వాళ్లు ఏ రాత్రిళ్లు ఏం చేసుకోవాలో వారే నిర్ణయించుకునేలా మంత్రులు వ్యాఖ్యలు చేయాలని కానీ.. వారి మరింత ఇబ్బందులు పాలు చేసేలా వ్యాఖ్యలు చేయరాదని మహిళా సంఘాలు సూచిస్తున్నాయి.
ఒక జాతీయ చానల్కిచ్చిన ఇంటర్వ్యూ లో కేంద్ర మంత్రి మహేశ్ శర్మ మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలు రాత్రుళ్లు స్వేచ్ఛగా బయట సంచరించడం విదేశాలలో అయితే చెల్లుబాటు అవుతుందనీ, భారతదేశంలో మాత్రం కాదనీ ఆయన అన్నారు. అయితే ఈ ప్రకటన వివాదాస్పదం కావడంతో వివరణ ఇచ్చుకున్నారు. ‘‘నా కుమార్తె కూడా డాక్టరు. ఆమె కూడా రాత్రుళ్లు సినిమాలకు వెళుతుంది. భారతీయ, ఐరోపా సంస్కృతులు భిన్నమైనవని చెప్పానంతే’’ అని వివరణ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో చేసిన మరో వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా మంత్రివర్యులు వివరణ ఇచ్చారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్.. మహ్మదీయుడు అయినప్పటికీ.. ఆయన సంపూర్ణ దేశభక్తి ఇమిడివున్న వ్యక్తని వివరణ ఇచ్చుకోవడం కూడా వివాదాస్పదమైంది. దీనిపై జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ స్పందిస్తూ.. అబ్దుల్ కలామ్ పూర్తిగా ఫ్యాంటు వేసుకున్న దేశభక్తిపరుడని, అయితే సగం ప్యాంటు (నెక్కరు) వేసుకుని ఆర్ ఎస్ ఎస్ కార్యకలాపాలలో పాలుపంచుకునే నేతలు మాత్రమే దేశభక్తిపరులన్నట్లుగా వ్యవహరించరాదని అన్నారు. ఇక ఈ విషయం నుంచి కేంద్రంలోని మోడీ సారథ్యంలో గల ఎన్డీఏ ప్రభ్వుతం మాత్రం దూరం జరిగింది. మంత్రివ్యాఖ్యలపై ఎలాంటి ప్రతిస్పందన ఇప్పటివరకు వెలువరించలేదు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more