Modi addresses nation on Mann ki Baat

Pm narendra modi addresses nation on mann ki baat

PM Modhi , Man ki bath , all india radio

Prime Minister Narendra Modi, in the 12th episode of "Mann ki Baat" on Sunday shared his thoughts on a number of issues.

ఆ కార్యక్రమం ఆయనదే.. కానీ దానుంచి ఎంతో నేర్చరుకున్నారట

Posted: 09/20/2015 05:59 PM IST
Pm narendra modi addresses nation on mann ki baat

 ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రేడియోలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రజలతో ఆయన మాట్లాడుతూ..మన్ కీ బాత్ ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. ప్రజల శక్తిపై తనకెంతో నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు చేరువ చేస్తోన్న ఆకాశవాణికి ధన్యావాదాలు తెలిపారు. 30 లక్షల మంది గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారని వివరించారు. దేశ ప్రజలు చవకైన ఖద్దర్ దుస్తులు ధరించాలని కోరారు. పర్యాటక రంగంలో భారత్‌కు అపారమైన అవకాశాలున్నాయని వెల్లడించారు. ప్రజల సలహాలకు ప్రాధాన్యతనిస్తామన్నారు. స్వచ్ఛ్ భారత్‌కు మరింత ప్రాధాన్యతనివ్వాల్సి ఉందని పేర్కొన్నారు.

దేశంలో ప్రజల శక్తి తిరుగులేనిదన్నారు ప్రధాని నరేంద్రమోడీ. మన్‌కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ.ప్రజల భాగస్వామ్యంతో మా ప్రభుత్వం అనే అంశంపై మాట్లాడారు. ప్రజలందరూ స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించే దిశగా ఖద్దరును కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు.గ్యాస్ సబ్సిడీ ఉద్యమరూపంలో కొనసాగుతుందన్నారు మోడీ. సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నికల సంస్కరణల దిశగా  ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలను మోడీ అభినందించారు. దేశ వ్యాప్తంగా 55వేల మంది మోడీకి మన్‌కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రశ్నలు సంధించారు. వాటిలో కొన్నింటిని మోడీ ప్రస్తావించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modhi  Man ki bath  all india radio  

Other Articles