దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో తాజాగా మరో మిస్టరీ వీడింది. ఈ కేసులో భాగంగా విచారణను వేగవంతం చేసిన పోలీసులకు రాయ్ గఢ్ జిల్లాలోని అడవి ప్రాంతంలో ఓ పుర్రెతోపాటు అస్థికలు లభ్యమైన విషయం తెలిసిందే!
షీనాని హత్యచేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని ఆ ప్రదేశంలో పూడ్చినట్లుగా తెలిసిన నేపథ్యంలో పోలీసులు అక్కడ దర్యాప్తు చేయగా.. వారికి ఆ ఎముకలు లభ్యమయ్యాయి. అవి షీనాబోరా అస్థికలేనా? కాదా? అనే విషయమై ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపగా.. అవి ఆమెకు సంబంధించినవేనని పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని ఫోరెన్సిక నిపుణులు వెల్లడించారు. రాయ్ గఢ్ జిల్లాలో వెలికితీసిన పుర్రె, ఇతర ఎముకలతోపాటు ఇంద్రాణి ముఖర్జియా శాంపిల్స్ ను కలినాలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ విశ్లేషణ చేసింది. అందులో భాగంగా ఇద్దరి డీఎన్ఏలు ఒక్కటేనని నిపుణులు స్పష్టం చేశారు. దీంతో.. ఆ అస్థికలు ఎవరివన్న మిస్టరీ వీడింది.
ఇదిలావుండగా.. ఈ హత్యకేసులో ప్రధాన నిందితులైన ఇంద్రాణి ముఖర్జియా, డ్రైవర్ శ్యామ్ రాయ్ ల జ్యుడీషియల్ కస్టడీని ముంబై కోర్టు మరో 14 రోజుల విధించింది. అయితే.. ఇంద్రాణి మాజీ భర్త సంజీవర్ ఖన్నాకు మాత్రం పోలీస్ కస్టడీ పొడిగించింది. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తదుపరి విచారణ నిమిత్తం కోల్ కతాకు తీసుకు వెళుతున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more