ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ అర్కిటెక్చర్ మొదటి సంవత్సరం విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో అటు ప్రభుత్వం.. ఇటు పోలీసులు అనుమానాలు పటాపంచలు అయ్యాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే యూనివర్సిటీ ప్రిన్సిపల్ బాబురావు వున్న సందేహాలు నివృత్తి అయ్యాయి. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో దోషులందరికీ శిక్ష పడే వరకు ఏటువంటి పరిస్థితిలో రాజీపడేదే లేదని అమె తండ్రి తేల్చిచెప్పి 24 గంటలు కూడా గడవకముందే.. నిందితులు.. వారి బంధువులు వ్యక్తం చేసిన అనుమానాలను ఫోర్సెనిక్ ల్యాబ్ అధికారులు పటాపంచలు చేశారు.
రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో అమె రాసిన డైరీ అంటూ మీడియాకు లభించిన పలు ఆధారాలను పోలీసులు సేకరించి వాటిని అమె రాసిందా లేదా మరెవరైనా ఇలా రాసారా అన్న కోణంలో దర్యాప్తు సాగించిన పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు అమె రాసిన డైరీలతో పాటు లేఖలను కూడా అప్పగించారు. కాగా, రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక వెల్లడైంది. సూసైడ్ నోట్ తో పాటు, రెండో డైరీలోని చేతిరాత రిషితేశ్వరిదేనని నివేదికలో తేలింది. మొత్తం రెండు డైరీలతో పాటు రిషితేశ్వరికి చెందిన మరో నాలుగు నోట్ బుక్స్ను ఫోరెన్సిక్ అధికారులు పరీక్షించారు. ఒక లాంగ్ నోట్ బుక్, మరొక స్పైరల్ బుక్, మరో రెండు ఆన్సర్ నోట్ బుక్లలోని రిషితేశ్వరి చేతిరాతను ఫోరెన్సిక్ అధికారులు పోల్చి చూశారు. ఈ నివేదికను ఫోరెన్సిక్ అధికారులు శనివారం గుంటూరు జిల్లా ఎస్పీకి అందచేశారు. ఈ కేసులో మరికొందరి పేర్లను చేర్చే అవకాశం ఉంది. ఛార్జ్షీట్ వేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more