గోరిచుట్టు మీద రోకటి పోటు అంటే ఇదే! అసలే ప్రత్యేక హోదా రాదనే బాధలో ఆంధ్రా ప్రజానీకం ఉంటే… ఇప్పుడు మరో బాంబు పేల్చింది కేంద్రం. ఆంధ్రాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మెట్రో రైలు నిర్మాణానికి కేంద్రం ఆదిలోనే బ్రేకులు వేసేసింది! విజయవాడతోపాటు విశాఖపట్నంలో కూడా మెట్రో రైలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు సర్కారు ఘనంగా చెప్పుకుంది. అప్పట్లో… ఈ రెండు పట్టణాల్లో మెట్రోరైళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తామని కేంద్రం కూడా హామీ ఇచ్చింది. ఆ ధీమాతో తిరుపతికి కూడా మెట్రో రైలు తెస్తామని ఏపీ సర్కారు ప్రకటించేసింది.
అంతేకాదు, అక్కడితో ఆగకుండా విజయవాడ, విశాఖపట్నంలలో సర్వేలు కూడా నిర్వహించారు. మెట్రో రైలు నిపుణుడు శ్రీధరన్తో సర్వేలు కూడా చేయించేశారు. ఆ సర్వేల నిమిత్తం భారీగానే ఖర్చు కూడా పెట్టేశారు. అయితే, ఇప్పుడు కేంద్రం మెట్రో రైలు విషయంలో అడ్డుపుల్లేసింది. విజయవాడ, విశాఖపట్నం లలో మెట్రోరైలు నడపడం ఆచరణ సాధ్యం కాదు అంటోంది. ఎందుకంటే, మెట్రో రైలు ఎంతో పెట్టుబడితో కూడుకున్న అంశం. ఆ తరువాత నిర్వహణ కూడా బాగా ఖర్చు ఉంటుంది. కాబట్టి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా గిట్టుబాటు కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు మెట్రో నిర్మించినా భవిష్యత్తులో మరింత భారంగా మారుతుందని చెబుతోంది. అందుకే, దానికి ఆర్థిక సాయం చేయలేమని తేల్చేసింది. మొత్తానికి విజయవాడ, విశాఖపట్నంలలో మెట్రో కలలు కల్లలుగానే మిగిలిపోనున్నాయి. ప్రస్తుతానికైతే ఏమీ చెయ్యలేమని కేంద్రం చేతులెత్తేసింది. మరి చంద్రబాబు నాయుడు దీని మీద ఎలా స్పందిస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more