కడప జిల్లాలో నారాయణ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యల ఘటనకు సంబంధించి త్రిసభ్య కమిటీని నియమిస్తూ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై త్వరితగతిన విచారణ పూర్తి చేసి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని గంటా తన తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు. కమిటీ సభ్యులుగా పద్మావతి యూనివర్శిటీ రిజిస్ట్రార్ విజయలక్ష్మి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంట్రోలర్ మాణిక్యం, కడప డీఆర్వోలను ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీలో నియమించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో గంటా ఫోన్ చేసి ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కడప నగర శివార్లలోని చింతకొమ్మదిన్నెలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదవుతున్న ఇద్దరు విద్యార్థినిలు సోమవారం సాయంత్రం ఒకే గదిలో వేర్వేరు ఫ్యాన్లకు తమ చున్నీలతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థుల మృతిపై విపక్ష్ నేత జగన్ శవ రాజకీయం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కడపలో విద్యార్థుల మృతిపై విచారణకు ఆదేశించామని మంత్రి తెలిపారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని గంటా చెప్పారు. విద్యార్థుల మృతిని కూడా రాజకీయం చేయాలనుకోవడం జగన్ అవగాహనరాహిత్యానిెకి నిదర్శమని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలేవి లేకపోవడంతో జగన్ ఈ పోకడలకు తెర లేపుతున్నారని గంటా అన్నారు. కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలను ఉపేక్షించేదిలేదని మంత్రి స్పష్టం చేశారు.
అయితే ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 5వ తేదీలోగా ఖాళీగా ఉన్న వీసీ పోస్టులు భర్తీ చేస్తామని గంటా తెలిపారు. అక్టోబర్ 15వ తేదీన ప్రతిభా అవార్డుల ప్రదానం చేస్తామన్నారు. సెప్టెంబర్ 5 వ తేదీన గురుపూజోత్సవంను విశాఖలో జరుపుతున్నామన్నారు. తెలుగు యూనివర్శిటీ, అంబేద్కర్ యూనివర్శిటీ వివాదంపై కోర్టుకు వెళ్లే ఆలోచలనలో ఉన్నామని గంటా తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more