సుదీర్ఘ కాలం తరువాత సుమారుగా 34 ఏళ్ల తరువాత భారత ప్రధాని నరేంద్రమోడీ యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో బిజీ బిజీగా గడపనున్నారు. అ దేశ ప్రముఖ నగరం అబుదాబిలోని ప్రఖ్యాత షేక్ జయేద్ మసీద్ ను సందర్శించి.. మతసామరస్యాన్ని చాటారు. మసీదు లోపల కలియతిరిగిన ప్రధాని ఆ పవిత్ర ప్రార్థనామందిరం ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. భారత్ సహా, ప్రపంచంలోని చాలా దేశాల నుంచి తీసుకువచ్చిన మార్బుల్స్ తో ఈ మసీద్ నిర్మించారు. 2007 నుంచి మసీదులోకి సందర్శకులను అనుమతిస్తున్నారు. అయితే ఇలా మసీదులో అడుగుపెట్టిన మోడీ.. అలా తొలిసారిగా అబుదాబిలో హైందవ ఆలయ నిర్మాణానికి స్థలాన్ని కూడా కేటాయిచేలా చర్యలు తీసుకున్నారు. దుబాయ్ లో రెండు ఆలయాలు వున్నా అబుదాబిలో ఆలయం లేదు. మోడీ రాక సందర్భంగా ఆలయానికి స్థలాన్ని కేటాయించింది అక్కడి ప్రభుత్వం.
ఆ తరువాత ఆబుధాబి శివారులోని కార్మిక నివాసాన్ని సందర్శించి.. బారత కార్మికుల క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. క్యాంపులోని భారతీయ కార్మికులను ప్రత్యేకంగా ఇండోర్ స్టేడియంలో కలుసుకున్న మోదీ... హిందీతో పాటు అనువాదకుల సహాయంతో మలయాళం, తెలుగు, తమిళ భాషలు మాట్లాడే కార్మికులతో నవ్వుతూ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా కథ్లపూర్ మండలం భూషణ్రావు పేట గ్రామానికి చెందిన ముస్కు రాము అనే ప్రవాసీ యువకుని భుజంపై చేయి వేసి ప్రధాని అనేక కుశల ప్రశ్నలు అడిగారు. అనంతరం మరో కార్మికునితో మాట్లాడుతుండగా... తెలంగాణ కార్మికుడు ప్రధానితో మాట్లాడబోయాడు. దీంతో, ‘‘తెలంగాణా.. ఉండూ.. ఉండూ...’’ అని ప్రధాని స్పందించారు.
మస్టర్ నగరంలో గల సౌరవిద్యుత్ కార్ల సంస్థను పరిశీలించారు. ప్లాంట్లో కార్ల తయారీ విధానాన్ని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే యూఏఈ రాజు షేక్ మహ్మద్ బిన్ జయాద్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశంతో పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అనంతరం నిర్వహించిన పెట్టుబడిదారుల సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. భారత్ దేశంలో పెట్టుబడులకు ముందుకు రావాలని వారిని అహ్వానించారు. ప్రస్తుతం దేశంలో ట్రిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులకు అవకాశముందని చెప్పారు. పెట్టుబడిదారులు ముందుకువస్తే వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం సమకూర్చేందుకు సిద్దంగా వుందని అన్నారు. గత 34 ఏళ్లగా తెగిన వ్యాపారసంబంధాలను మళ్లీ బలోపేతం చేసుకునేందుకు పెట్టుబడులు దోహదపడుతాయన్నారు. రియల్ ఎస్టేట్, ఇన్ ఫ్రాస్టక్చర్, ఇంధనం తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more