అబ్దుల్ కలాం.. నిరాడంబరంగా జీవితాన్ని గడిపిన మహోన్నత వ్యక్తి. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరువని మామూలు వ్యక్తి. శాస్ర్తసాంకేతిక రంగాల్లో తన ప్రతిభా పాఠవాలతో అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి. అయితే ప్రతి మనిషి ఇష్టమైవంటూ ఏవో కొన్ని వ్యాపకాలుంటాయి. మన అబ్దుల్ కలాంకు ఒకటి కాదు రెండు వ్యాపకాలు ఉన్నాయి. ఎన్నడూ రెండు అంటే ఎంతో ఇష్టపడేవారు. అవి ఒకటి పిల్లలు అంటే చెప్పలేనంత ప్రేమ.. ఇక రెండోది లెక్చర్ ఇవ్వడం. ఈ రెండు అంటే అబ్దుల్ కలాంకు వల్లమాలిన ప్రేమ. అందుకే రోజుకు మూడు వందల మంది చిన్నాలను కలిసే వారంటే ఆయనకు చిన్న పిల్లల మీద ఎంత ప్రమేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రపతిగా కంటే చిన్న పిల్లలతో కలిసి ఉండటం అంటే అబ్దుల్ కలాంకు ఎంతో ప్రేమ అనే మాట అక్షరాల నిజం.
పిల్లలంటే అబ్దుల్ కలాంకు ఎంతో ప్రీతి. ఎక్కడకెళ్లినా కాసేపు వారితో గడిపి మురిసిపోయేవారు. ''ఎప్పుడూ కలలు కనాలి.. వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడాలి'' అని చెప్పే కలాం.. చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఏ నగరానికి, ఏ కార్యక్రమం కోసం వెళ్లినా..అక్కడ ఏదో ఒక విద్యాసంస్థలో తప్పనిసరిగా ఒక కార్యక్రమం పెట్టుకునేవారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ అనంతరం కూడా కలాం విద్యారంగానికి విశిష్ట సేవలందించారు. చివరి నిమిషం వరకూ విద్యాభివృద్ధికే సమయం కేటాయించారు. చదువు.. సమాజాభివృద్ధికి ఉపయోపడేలా అబ్దుల్ కలాం ఎన్నో వేదికలపై విద్యార్థులకు ఉపన్యాసాలు ఇచ్చారు. తన ప్రసంగాలతో యువతలో కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చారు. నిరాశ నిస్రృహలో ఉన్న యువతలో ఆత్మ స్తైర్థ్యం నింపుతూ. ఒక మార్గదర్శకంగా నిలిచారు. ఆత్మన్యూనత భావంతో ఉన్న వారిని ఆయన ప్రసంగాలు తట్టిలేపుతాయి. అబ్దుల్ ప్రేరణతో ఉన్నత శిఖరాలకు ఎదగినవారేందరో ఉన్నారు. రాష్ట్రపతి పదవిని అధిష్టించి ప్రజల రాష్ట్రపతిగా పేరు గడించిన కలాం పదవి విరమణ అనంతరం విద్యాభివృద్ధికే ఎక్కువ సమయం కేటాయించారు.
చివరి నిమిషం వరకూ కలాం వివిధ విశ్వవిద్యాలయాలను సందర్శిస్తూ.. విద్యార్థులకు సైన్స్ పాఠాలతో పాటు దేశభక్తిని పెంపొందించే సందేశాలిచ్చారు. కలాంకు పిల్లలంటే ఎంతో ఇష్టం. చివరి నిమిషాం కూడా పిల్లలతోనే గడిపారు. షిల్లాంగ్ ఐఐఎంలో విద్యార్థుల కోసం లివబుల్ ప్లానెట్ ఎర్త్ అనే అంశంపై సెమినార్లో పాల్గొన్నారు. అలా పిల్లలతో కలిసిపోయి వాళ్లలో ఒక పిల్లాడిలా ఆయన ఆనందించేవారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించే సమయంలో అక్కడి విద్యార్థులతో సమావేశమయ్యేవారు. సైన్స్, టెక్నాలజీపై వారికి ఉపన్యాసమిచ్చేవారు. వారి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చేవారు. అంతేకాదు.. చిన్నారులకు ఓపిగ్గా ఆటోగ్రాఫ్లు ఇచ్చేవారు. ఆ సేతు హిమాచలం వేలాది మంది విద్యార్థులతో ఆయన చర్చల్లో పాల్గొన్నారు.
విద్యార్థులకు పాఠాలు బోధించడమంటే కలాంకు ఎంతో ఇష్టం. తన జీవితానుభవాలనే యువతకు సందేశమిచ్చేలా ''వింగ్స్ ఆఫ్ ఫైర్'' పేరుతో ఆత్మకథను కూడా రాశారు. భారతదేశంలో ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా ఇంతటి అభిమానాన్ని పొందిన ఏకైక రాష్ర్టపతి కూడా అబ్దుల్ కలామే అనడంతో ఏ మాత్రం సందేహం లేదు. ఈ ప్రతిభాపాటవాలకు ఎన్నో పురస్కారాలు, అవార్డులు వరించాయి. 40 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. కళాశాల కమిటీల్లో సభ్యత్వం కల్పించాయి. రామేశ్వరం నుంచి రాష్ర్టపతి అయినా అబ్దుల్ కలాం నిరాండబరతకు నిలువెత్తు నిదర్శనమని చెప్పొచ్చు. అబ్దుల్ కలాం.. రామేశ్వరం నుంచి రాష్ర్టపతి అయినా నిరాండబరతకు ఆయన నిలువెత్తు నిదర్శనమని ప్రముఖులు కొనియాడారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more