తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వివాదం నెలకొంది. ఆయన రాజీనామా చెయ్యలేదని స్పీకర్ కార్యాలయం వెల్లడిస్తే.. తాను మాత్రం రాజీనామా చేశానని, స్పీకర్ కు కూడా తన రాజీనామా పత్రాన్ని అందించానని, స్పీకర్ ఆమోదించడమే తరువాయి అని పేర్కొన్నారు. తలసాని రాజీనామా వ్యవహారంపై టీడీపీ నాయకులు గవర్నర్ ను కలిసిన నేపథ్యంలో.. ఆయన వెంటనే మీడియా సమావేశాన్ని నిర్వహించి తన రాజీనామా విషయమై మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీ పార్టీకి సవాళ్లు విసురుతూనే.. తనదైన శైలిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై బాబు ఏం చెబుతారంటూ తలసాని నిలదీశారు.
ఈ క్రమంలోనే తలసాని మాట్లాడుతూ.. దేశంలోని అన్ని శాసనసభల్లో ఒకే చట్టం అమలైనప్పుడు, తెలంగాణలో వర్తించిన నిబంధనలు ఆంధ్రప్రదేశ్ లో వర్తిస్తాయా? లేదా? అని అడిగారు. అలా వర్తించినప్పుడు.. ఇతర పార్టీల గుర్తులతో గెలిచిన అభ్యర్థులు టీడీపీ చేరినప్పుడు లేని అభ్యంతరం, తనకు మాత్రమే ఎందుకు వర్తిస్తుందని అన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. తలసాని ఈ విధంగా బాబుని నిలదీయడమే కాకుండా టీడీపీ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేతలు కేవలం కాళ్లరిగేలా తిరగడమే తప్ప.. ఇంకేమీ చేయలేరని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ నేతల్లా డొంక తిరుగుడు విధానం తనకు తెలియని, ఏదైనా సూటిగానే వ్యవహరిస్తానని తలసాని స్పష్టం చేశారు.
రాజకీయం అంటే ఏమిటో తనకు కూడా బాగా తెలుసునని, తాను కూడా రాజకీయాల్లోనే వున్నానని తలసాని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలతో డ్రామాలు ఆడించడం బాబు మానేయాలని బాబుకు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ఒకే చట్టాలు, నిబంధనలు అమలవుతున్నాయని ఆయన బాబుకు స్పష్టం చేశారు. తాను దేనికీ భయపడటం లేదని, ఉప ఎన్నికలకు సిద్ధంగా వున్నానని తలసాని పేర్కొన్నారు. మరి.. ఈయన ఈ విధంగా మండిపడటంపై టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more