Cm Kcr Attacked By Spirit Says Nagam Janardhan Reddy | Bjp Party | Telangana Govt

Cm kcr attacked by spirit nagam janardhan reddy bjp party

cm kcr news, kcr controversy, kcr spirit, kcr attacked by spirit, nagam janardhan reddy, telangana state, telangana issues, bjp party, bjp party controversy, nagam updates

Cm Kcr Attacked By Spirit Nagam Janardhan Reddy Bjp Party : Bjp Party Leader Nagam Janardhan Reddy Says That Telangana Cm Kcr Attacked By Spirit Which Is Ruling Telangana Govt

బాబోయ్.. కేసీఆర్ ని ఓ ‘ఆత్మ’ ఆవహించిందట!

Posted: 07/21/2015 06:27 PM IST
Cm kcr attacked by spirit nagam janardhan reddy bjp party

తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఓ ఆత్మ ఆవహించిందంటూ ప్రస్తుతం రాజకీయవర్గాల్లో వాడీవేడీగా చర్చలు కొనసాగుతున్నాయి. ఆయనలో ఆవహించిన ఆ ఆత్మే తెలంగాణ సర్కారును నడిపిస్తోందని చెప్పుకుంటున్నారు. ఇదేంటి..? ఉన్నట్లుండీ ఈ ఆత్మ గోల తెరమీదకి రావడమేంటి..? అది కూడా సీఎం కేసీఆర్ ఆవహించడమేంటి..? అని సందేహిస్తున్నారా! ఆయనకు నిజంగానే ఆత్మ ఆవహించిందో లేదో తెలియదు కాదు.. ఈ పుకార్లను లేవనెత్తింది మాత్రం బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి. గతకొన్నాళ్ల నుంచి మీడియా ముందుకు రాని ఈయన.. తాజాగా కేసీఆర్ కి ఆత్మ ఆవహించిందంటూ సరికొత్త నినాదంతో సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే.. తెలంగాణ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు.

తెలంగాణలో పాలన అదుపు తప్పిందని, ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నాయని, నిధుల చెల్లింపులు సరిగ్గా జరగడం లేదని జనార్థన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. స్వార్థపూరిత ప్రయోజనాల నేపథ్యంలోనే నిధులు ఆపారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ భారీ కాంట్రాక్టులన్నీ తన అనుచరులకే అప్పగిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ వ్యవహారశైలి చూస్తుంటే.. అప్పట్లో ఓ ముఖ్యమంత్రిని ఆవహించిన ఆత్మ ఇప్పుడు ఈయనకు ఆవహించినట్లుగా తెలుస్తోందని నాగం వ్యాఖ్యానించారు. ప్రస్తుత తెలంగాణ సర్కారును ఆ ఆత్మే నడిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విధంగా నాగం ‘ఆత్మ’ ప్రస్తావనను బయటికి తీసుకురావడంతో తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ ‘ఆత్మ’ ఎవరు? అనే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది వరకు ఏ ముఖ్యమంత్రికి ఎవరి ఆత్మ ఆవహించిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలోనే కొందరు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కేవీసీ రామచంద్రరావు తన ఆత్మ అని పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే! అప్పట్లో ఆయనలా పేర్కోవడంపై ముఖ్యమంత్రి వైఎస్సార్ కి కేవీపీ ఆత్మ ఆవహించినట్లు వివక్ష పార్టీలు ఎద్దేవా చేసిన సందర్భాలూ వున్నాయి. ఆ కేవీపీ ఆత్మే ఇప్పుడు కేసీఆర్ కి ఆవహించిందంటూ నాగం వ్యాఖ్యానించినట్లు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే.. ఇటీవల కేవీపీతో కేసీఆర్ రహస్యంగా భేటీ అయ్యారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తను దృష్టిలో పెట్టుకునే నాగం అలా పేర్కొని వుంటారని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cm kcr  nagam janardhan reddy  spirit  

Other Articles