ఓటుకు నోటు కేసులో అరెస్టు చేసిన సండ్ర వెంకట వీరయ్యకు సంబందించి తెలంగాణ ఏసీబీ కోర్టులో వాదిస్తు.. సండ్ర వెంటకవీరయ్య వ్యవహారంతో పాటుగా మరో కొత్త పేరును తెర మీదకు తీసుకువచ్చింది. జనార్దన్ అనే వ్యక్తితో సండ్ర సంప్రదింపులు జరిపారని, జనార్దన్ అనే వ్యక్తికి సంబందించిన వివరాలు తెలిపాయాలంటే సండ్ర వెంకటవీరయ్యను తమ కస్టడీకి అప్పగించాలని ఏసీబీ వాదించింది. అయితే అసలు ఈ జనార్దన్ అనే వ్యక్తి ఎవరు..? నిన్నటి వరకు జిమ్మి అనే పేరు విని ఎవరా అనుకున్న వారికి మరో కొత్త పేరు రావడం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అయితే జనార్దన్ అనే వ్యక్తి సండ్ర చేస్తున్న వ్యవమారంపై ఎప్పటికప్పుడు సమాచరం అందుకుంటున్నారని, అసలు మొత్తం వ్యవహారం జనార్దన్ అనే వ్యక్తి కనుసనల్లోనే నడిచిందని ఏసీబీ అధికారులు బావిస్తున్నారు.
అసలు ఎవరీ జనార్దన్..? సండ్ర తరఫు మనిషా..? లేదా తెలుగుదేశం పార్టీ తరఫున రాయబారం నడిపిన వ్యక్తా..? జనార్దన్ అన్న పేరు వాడుకలో మాత్రమే వాడారా..? అసలు పేరు వేరే ఉందా..? ఫోన్ రికార్డ్ ల ఆధారంగా వచ్చిన సమాచారం పక్కాగా నిజమూనా..? లేదా సండ్ర తరుచుగా మాట్లాడే దగ్గరి వ్యక్తినా..? ఇలా ప్రశ్నల వర్షం వస్తూనే ఉంది కానీ సమాధానం మాత్రం లేదు. అయితే నిన్నటి దాకా జిమ్మి అనే కొత్త పేరు తెర మీదకు వస్తే తాజాగా జనార్దన్ అనే పేరు తెర మీదకు వచ్చింది. అసలు ఓటుకు నోటు వ్యవహారంలో ఎంత మంది ఉన్నారు..? రేవంత్ రెడ్డితో ప్రారంభమైన నిందితుల జాబితా అంతకంతకు పెరుగుతూనే ఉంది. మరి ఇంకా ఎంత మంది ఈ జాబితాలో చేరుతారు అన్నది ప్రశ్న. అయితే రేవంత్ రెడ్డిని తప్పించి.. కేసును డైవర్ట్ చెయ్యడానికే ఇలా కొత్త వాళ్ల పేర్లు తెర మీదకు వస్తున్నాయా అనే అనుమానం కూడా కొంత మంది వ్యక్తం చేయడం గమనార్హం. మరి మొత్తానికి ఓటుకు నోటు కేసు ఎటు తిరిగి ఎటు పోతుందో చూడాలి.
By Abhinavachary
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more