ఓటుకు నోటు కూసులో కీలకంగా భావిస్తున్న ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పండ్ర వెంకటవీరయ్య ను ఏసీబీ అధికారులు కోర్టు ముందు హాజరుపర్చారు. అయితే ఓటుకు నోటు కేసులో సండ్రను ఐదో నిందితుడిగా చేర్చారు. ఏ1గా రేవంత్ రెడ్డి, ఏ2గా సెబాస్టియన్, ఏ3గా ఉదయ్ సింహా, ఏ4గా మత్తయ్యలు గా ఉండగా తాజాగా ఏ5గా సండ్ర వెంకటవీరయ్య పేరును చేర్చింది తెలంగాణ ఏసీబీ. ఓటుకు నోటు కేసులో తెంలగాణ టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు అరెస్టు చెయ్యడంపై సత్తుపల్లిలో బంద్ వాతావరణం తెర లేచింది. అయితే సండ్ర మరో ఐదుగురికి ఫోన్ చేసినట్లు, దాదాపు 22 సార్లు ఫోన్ మాట్లాడారని, ఓటుకు నోటు కేసులో ముందు మాట్లాడింది సండ్ర వెంకటవీరయ్యేనని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అయితే సండ్ర కాల్ డేటా ఆధారంగా ఓటుకు నోటు వ్యవహానంలో సండ్ర పాత్రపై క్లారిటీ ఉందని ఏసీబీ వాదించింది.
అయితే విచారణకు హాజరైన సండ్ర కనీసం ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదని, కాబట్టి ఐదు రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ఏసీబీ కోర్టును కోరింది. అయితే ప్రస్తుత ప్రాథమిక సాక్షాధారాల ప్రకారం ఓటుకు నోటు వ్యవహారంలో సండ్ర పాత్ర ఉందని కోర్టు నమ్ముతూ రెండు వారాల కస్టడీ విధిస్తు కోర్టు తీర్పునిచ్చింది. అయితే సండ్ర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సండ్ర తరఫు లాయరుకు సలహా కూడా ఇచ్చింది. అయితే వెంటనే బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు సండ్ర తరఫు లాయరు. అయితే రేపు ఈ పిటిషన్ విచారణకు రానుంది. ఏసీబీ అధికారులు తనపై తప్పుడు కేసులు బనాయించారని సండ్ర ఆరోపించారు. విచారణలో భాగంగా తనకు తెలిసిన అన్ని వివరాలను ఏసీబీ అధికారులకు వివరించానని సండ్ర వెల్లడించారు. కేవలం ఫోన్ డాటా ఆధారంగా కేసులు ఎలా నమోదు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఏసీబీ అధికారులు తనపై నమోదు చేసిన తప్పుడు కేసుపై కోర్టులో న్యాయపోరాటం చేస్తానని సండ్ర ప్రకటించారు. అయితే సండ్ర అరెస్టు వార్త వినగానే సండ్ర కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
By Abhinavachary
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more