డైబ్భై అయిదేళ్లకు పైబడిన వారినందరినీ 2014 మే 26న బ్రెయిన్డెడ్గా ప్రకటించారు అంటూ బిజెపి సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా మంత్రివర్గంలో చేర్చుకోవడానికి 75 ఏళ్ల వయసును కటాఫ్గా పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్యంగా అన్నారు.యశ్వంత్ సిన్హాను మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ ప్రభుత్వాల మధ్య తేడా ఏమిటని ప్రశ్నించినప్పుడు అటల్బిహారీ వాజపేయి, చంద్రశేఖర్ ప్రభుత్వాల్లో ఆర్థిక, విదేశాంగ శాఖలు నిర్వహించిన సిన్హా బిజెపి సీనియర్లను నిర్లక్ష్యం చేయడంపై వ్యంగ్యంగా ఈ వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు ముందు మేక్ ఇండియా జరిగితే మిగతావన్నీ వాటంతటవే వస్తాయంటూ నరేంద్ర మోదీ ప్రకటించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంపై కూడా ఆయన పరోక్షంగా విమర్శలు చేసారు. బ్రెయిన్ డెడ్ అయిన వాళ్లలో నేనూ ఒకడిని అని యశ్వంత్ సిన్హా అన్నారు.
మోదీ మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంపై అలకపూనిన అద్వానీ, మురళీ మనోహర్ జోషీ లాంటి సీనియర్ నేతల్లో యశ్వంత్ సిన్హా కూడా ఉన్న విషయం తెలిసిందే. అద్వానీ, జోషీలకు బిజెపి ‘మార్గదర్శక్ మండలి’లో సభ్యులుగా స్థానం కల్పించగా సిన్హాకు మాత్రం ఆ ఆవకాశం కూడా దక్కలేదు. గంగానదిని శుభ్రం చేయడానికి మోదీ ప్రకటించిన ‘నమామి గంగే’ ప్రాజెక్టు ఎప్పటికీ విజయవంతం కాదంటూ జోషీ ఇటీవల ఆ ప్రాజెక్టుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం తెలిసిందే. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంపై విమర్శలు చేయడానికి సిన్హా ఆర్థిక మంత్రిగా తాను పని చేసిన రోజులను గుర్తుకు చేసుకుంటూ, రోడ్లు నిర్మించడానికి ఉపయోగించే భారీ పరికరాలపై సుంకాన్ని తాను తగ్గించానని, ఫలితంగా రోడ్ల నిర్మాణం వేయవంతం అయి దేశ ఆర్థిక రంగానికి ఎంతో మేలు జరిగిందని చెప్పారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more