ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనాన్ని రేపిన ఓటుకు నోటు వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వివాదాలకు తెర తీసింది. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, ఉమ్మ్డి హైదరాబాద్ లో తమకు రక్షణలేకుండా పోయిందని కాబట్టి హైదరాబాద్ లొ సెక్షన్-8 అమలు చెయ్యాలని ఏపి ప్రభుత్వం వత్తిడి తీసుకువస్తోంది. సెక్షన్ 8 అమలు విషయంలో చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారని, ఏదో ఒక నిర్ణయం తీసుకోవడమే సమంజసంగా ఉంటుందని సలహాదారులిద్దరూ గవర్నర్కు సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే, సెక్షన్ 8 అమలుపై తాను నిర్ణయం తీసుకోవడానికి బదులుగా.. దానిపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుసుకోవాలని గవర్నర్ నరసింహన్ భావించారు. అందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ను రాజ్భవన్కు పిలిపించి ఈ అంశంపై చర్చించారు. కేసీఆర్ గవర్నర్తో దాదాపు గంటన్నరపాటు భేటీ అయ్యారు.
తాజా రాజకీయ పరిణామాలు, సెక్షన్ 8 అమలుకు ఏపీ సర్కారు పట్టుపడుతుండటం, ఈ విషయంలో కేంద్ర సర్కారు మనోగతం, స్టింగ్ ఆపరేషన్పై కేంద్రం, ఏపీ ప్రభుత్వాల వైఖరి వంటి అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా, ఒక రాష్ట్ర రాజధానిలో మరో రాష్ట్రానికి చెందిన పోలీసుల ప్రమేయం ఉండడం, ఒక రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా, శాంతి భద్రతలను గవర్నర్ చేతిలో పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. అప్పట్లో బిల్లు పాస్ కావటం కోసం.. హైదరాబాద్లోని సీమాంధ్రుల భద్రతకు భరోసా కల్పించటం కోసం కంటితుడుపు చర్యగా ఆ సెక్షన్ పెట్టారని, దీనిపై ఇప్పటి వరకు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. ఒకవేళ కేంద్రం ఈ సెక్షన్ను అమలు చేయాలనుకుంటే, తెలంగాణ సమాజం పూర్తిగా వ్యతిరేకిస్తుందని, కోర్టులో కూడా నిలబడదని గవర్నర్కు ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. రాజ్యాంగ విరుద్ధమైన సెక్షన్ 8ని అమల్లోకి తేవటానికి అంగీకరించే సమస్యే లేదని కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. అలా సెక్షన్-8 అమలు వీలు కాదని, కాదని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించినా కోర్టులో తేల్చుకుంటామని కేసీఆర్ గవర్నర్ కు స్పష్టం చేశారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more