తన ఇంట్లో పనిచేసే పనిమనిషిపై అత్యాచారం చేసిన కేసులో ఓ మాజీ ప్రజా ప్రతినిధికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో నిందితులుగా అభియోగాలను ఎదుర్కోంటున్న నలుగురిలో ఇద్దరికి రెండేళ్ల శిక్షను విధించిన న్యాయస్థానం మరో ఇద్దరిని నిర్దోషులగా విడిచిపెట్టింది. 2010లో జరిగిన ఈ కేసుపై ఇవాళ తుది తీర్పును వెల్లువరించింది న్యాయస్థానం. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీఎస్పీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తం నరేష్ ద్వివేదీకి సీబీఐ ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది. దాంతోపాటు ఆయనకు లక్ష రూపాయల జరిమానా విధించింది. అందులో సగం బాధితురాలికి పరిహారంగా చెల్లిస్తారు. ద్వివేదీతో పాటు మరో ఇద్దరు సహ నిందితులు రాం నరేష్, వీరేంద్రకుమార్ శుక్లాలకు రెండేళ్ల చొప్పున జైలుశిక్ష, రూ. 2వేల వంతున జరిమానా విధించారు.
ఇదే కేసులో నిందితులుగా ఉన్న రాజేంద్రశుక్లా, సురేష్ నేతలను నిర్దోషులుగా విడిచిపెట్టారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక జడ్జి వీకే శ్రీవాస్తవ తీర్పు ఇచ్చారు. 2010లో అప్పటికి 17 ఏళ్ల వయసున్న బాధితురాలు.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసేది. డిసెంబర్ పదో తేదీన ఆమెను చోరీ కేసులో ఇరికించి, పారిపోతోందని చెప్పి.. ఆమెపై అత్యాచారం చేశారు. ఈ విషయం మీడియాలో రావడంతో నాటి సీఎం మాయావతి సీబీసీఐడీ విచారణ జరిపించి, ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారు. తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టు సూచన మేరకు సీబీఐ చేతికి వెళ్లింది. తాజాగా ఆ మాజీ ఎమ్మెల్యేకు పదేళ్ల జైలుశిక్ష పడింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more