ఓటుకు నోటు వ్యవహారంలో ఏపి సిఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే తాజాగా చంద్రబాబు నాయుడుకు మరో చేదు వార్త వినిపించే అవకాశం ఉంది. మూలిగే నక్క మీద తాటి కాయ అన్నట్లు ఇప్పటికే టెన్షన్ తో నిద్ర కూడా పట్టకుండా ఉంటున్న చంద్రబాబుకు తెలంగాణ ఏసీబీ అదికారులు షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా రేవంత్ రెడ్డి వ్యవహారంలో నోటీసులు అందించాలని ఏసీబీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే జైలులో ఉంటున్న రేవంత్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని కోరిన ఏసీబీ అధికారులు.. తాజాగా చంద్రబాబుకు కూడా నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో తమ బాస్ అన్నీ చూసుకుంటారని.. అన్న మాటల ఆధారంగా లేదా నాయిని నర్సింహారెడ్డి అన్నట్లు నిజమైన ఆడియో ఆధారాలు ఉన్నాయన్న నమ్మకంతోనో తెలియదు కానీ ఏసీబీ అధికారులు మాత్రం చంద్రబాబు నాయుడకు నోటీసులు జారీ చెయ్యాలని నిర్ణయించారు.
అయితే రేవంత్ రెడ్డి వ్యవహారంలో మరింత సమాచారాన్ని ఏసీబీ అధికారులు సేకరించినట్లు సామాచారం. రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన యాభై లక్షల నగదు ఎన్డీఆర్ ట్రస్టు భవన్ కు దగ్గరలో ఉన్న ఓ బ్యాంక్ నుండి డ్రా చేసినట్లు సమాచారం. అయితే మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలకు తలా యాభై లక్షల చొప్పున రెండున్నర కోట్ల రూపాయలు సిద్దం చేసిన్టలు కూడా ఏసీబీ అధికారులు బావిస్తున్నారు. మరి అందరూ విమర్శిస్తున్నట్లు చంద్రబాబు నాయుడే సూత్రదారా.? లేదా కేవలం విమర్శలు మాత్రమేనా అన్న విషయాలు నిగ్గు తేలాల్సి ఉంది. మొత్తానికి అటు తిరిగి ిటు తిరిగి చివరకు చంద్రబాబు దాకా రానే వచ్చింది ఓటుకు నోటు వ్యవహారం.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more