టేస్టీ, హెల్దీ అంటూ పిల్లలకే కాదు పెద్దవాళ్లకూ అడిక్షన్ లా మారిపోయింది. టూ మినిట్ నూడుల్స్ అంటూ మ్యాగీ కోట్లాది మందిని ఆకర్షించింది. అలాంటి మ్యాగీకి గడ్డుకాలం నడుస్తోంది. యూపీలో మొదలైన నిషేధం ఢిల్లీ, కేరళ, తమిళనాడుకు పాకి దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. సుమారు 10కి పైగా రాష్ట్రాల్లో బ్యాన్ కంటిన్యూ అవుతోంది. బెంగాల్, బీహార్, ఉత్తరాఖండ్, తెలంగాణ, ఏపీ, హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్, హర్యానాల్లో శాంపిల్ టెస్టులు జరుగుతున్నాయి. ఇండియన్ ఆర్మీ మ్యాగీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దేశవ్యాప్తంగా వెయ్యి క్యాంటీన్లలో ఆర్మీ మ్యాగీని ప్రొవైడ్ చేస్తోంది. బ్యాన్ కారణంగా వాటితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక మ్యాగీ బిగ్గెస్ట్ రీటైలర్ ఫ్యూచర్ గ్రూప్ సప్లై నుంచి తప్పుకుంది. అంతేకాదు నెస్లే పాల పాకెట్లలో లార్వా బయటపడింది. దాంతో తమిళనాడులో వాటినీ నిషేధించారు. ఇలా అన్ని వైపుల నుంచి నెస్లే ను కష్టాలు చుట్టుముట్టాయి. మ్యాగీ లాంటి కేసుల్లో చట్టాలను కఠినం చేస్తామని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేకాదు హానికర పదార్థాలను ప్రమోట్ చేసే వాళ్లపైనా కఠిన చర్యలు తప్పవని స్టేట్ మెంట్ ఇచ్చింది.
మ్యాగీ నూడుల్స్ లో లెడ్ ఎక్కువుందన్న విషయం దేశవ్యాప్తంగా పాకింది. మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుండటంతో ఆ ఎఫెక్ట్ సేల్స్ పై పడింది. మెట్రో సిటీస్ లో 40 శాతం సేల్స్ పడిపోయాయి. నెస్లే ప్రోడక్ట్స్ లో 20 శాతం ఆదాయం ఒక్క మ్యాగీ నుంచే వస్తుంది. కానీ దాని సేల్స్ పడిపోవడంతో నెస్లే షేర్లూ 10 శాతం పడిపోయాయి. ఏటా మ్యాగీ నూడుల్స్ బిజినెస్ 15 వందల కోట్లకు పైనే. మ్యాగీని ప్రమోట్ చేసిన అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతీ జింటాపై కేసులు నమోదయ్యాయి. 12 ఏళ్ల క్రితం చేసిన యాడ్ తో ఇపుడేంటి సంబంధమంటూ ప్రీతి జింటా ట్వీట్ చేసింది. ఇక అమితాబ్ కూడా మ్యాగీ యాడ్ పై వివరణ ఇచ్చారు. మొత్తానికి మ్యాగీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా మ్యాగీ పై బ్యాక్ వేసింది. తెలంగాణ వ్యాప్తంగా మ్యాగీ అమ్మకాలు జరపకూడదు అని తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more