ఓయు తాజాగా భూముల వివాదంతో రగులుతోంది. ఓయూ పరిసర ప్రాంతాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేసిన ఒక ప్రకటనతో ఉస్మానియా యుద్ధ భూమిని తలపిస్తోంది. తాజాగా సోమవారం టీఆర్ఎస్ పార్టీకి చెందిన జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చెందిన స్వాగత్గ్రాండ్ హోటలపై ఉస్మానియా విశ్వ విద్యాలయానికి చెందిన పలువురు విద్యార్థులు దాడి చేశారు. ఓయూకు చెందిన భూములను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆక్రమించుకుని హోటల్ నిర్మించారంటూ విద్యార్థులు ఈ దాడికి పాల్పడ్డట్టు చెబుతున్నారు. ఉస్మానియాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కొత్తగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇరకాటం పడేశాయి.
ఉస్మానియా విశ్వ విద్యాలయానికి చెందిన భూముల్లో పేదలకు ఇళ్లను కట్టిస్తామంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేసిన ప్రకటనతో ఉస్మానియా మళ్లి భగ్గమంటోంది. ఉస్మానియా భూములను విశ్వ విద్యాలయానికి చెందేలా చూడాలంటూ అటు విద్యార్థులు, ఇటు ప్రతిపక్ష పార్టీలతో పాటు టీజేఏసీ గత వారం రోజులుగా ఆందోళన చేస్తోంది. ప్రతి నిత్యం విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతల ఆందోళనలతో ఉస్మానియా అట్టడుకుతోంది. ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు నాన్బెయిలేబుల్ కేసులు నమోదు చేస్తున్నారు. పేదలకు ఇళ్లు కట్టించడానికి తాము వ్యతిరేకం కాదని, నిజాం ప్రభుత్వ కాలంలో ఉస్మానియాకు కేటాయించిన భూముల్లో సగానికి సగం గురయ్యాయని, ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వాటిని వెనక్కి తేవాలంటూనే..ఉస్మానియా భూములను పరిరక్షించాలని కోరుతున్నారు.
ఉస్మానియా విశ్వ విద్యాలయానికి చెందిన భూములను విశ్వ విద్యాలయానికి ఉపయోపడేలంటూ ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు నాన్బెయిలెబుల్ కేసులు పెట్టడంతో ఈ ఆందోళన మరింత తీవ్రరూపానికి దారి తీస్తోంది. విద్యార్థులపై పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేయాలంటూ రాజకీయ పార్టీలతో పాటు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఇదంతా రాజకీయమంటోంది. ఇళ్లు లేని పేదలకు ఇళ్లు కట్టిస్తామంటూ ప్రతిపక్షాలు, విద్యార్థులు అనవసరమైన రాద్దాంతం చేస్తున్నాయే తప్ప మరొకటి కాదంటోంది. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉస్మానియా విశ్వ విద్యాలయానికి చెందిన భూములలో పేదలకు ఇళ్లు కట్టిస్తామంటూ చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మారుతోంది. చూడాలి మరి ఉస్మానియా భూముల వ్యవహారం ఎక్కడి దాకా వస్తుందో..!
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more