temperature | ap | telangana

High temperatures killed near 700members

temperature, ap, telangana

High temperatures killed near 700members. From the past week death toll hike into double to trible digit.

ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 700 మందిని ఒకేసారి..!

Posted: 05/26/2015 12:05 PM IST
High temperatures killed near 700members

మగధీర సినిమాలో రామ్ చరణ్ డైలాగ్ గుర్తుందా.. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి పంపించు అంటూ సవాల్ విసురుతాడు. అలాగే తాజాగా ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 700 మంది చావులకు కారణమయ్యాడు సూర్యడు. అవును సూర్యుడు తన ప్రతాసాన్ని చూపిస్తు తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఉదయం ఎనిమిది గంట ల నుండి తన ప్రతాపాన్ని చూపిస్తు పొద్దుపొడిచినా ఎండ ప్రభావం మాత్రంగ తగ్గడం లేదు. ఎండ దెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బతో బస్సులోనే కన్ను మూసిన ఘటనలు చాలా జరుతున్నాయి.

మండుతున్న ఎండలతో జనాలు బేజార్ అవుతున్నారు. ఉష్ణోగ్రతలు పీక్స్ ను తాకడంతో వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక ఉష్ణోగ్రత అయితే 45 డిగ్రీలకు తగ్గడం లేదు. హైదరాబాద్, జినామాబాద్, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో ఒక్కోసారి 48 డిగ్రీలు కూడా నమోదవుతోంది. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 700 మంది చనిపోయారని సమాచారం. మారిన వాతావరణ పరిస్థితులు తెలుడు వారికి చెమటలు పట్టిస్తోంది. ఇక ఏపి ప్రభుత్వం ఎండ దెబ్బకు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : temperature  ap  telangana  

Other Articles