దొంగతనం జరిగితే దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసులు డ్యూటీ మరిచారు. పోలీసులం అన్న ధ్యాసే లేకుండా దొంగల్లా దొంగతనానికి పూనుకుంటే ఎలా ఉంటుంది. అవును తాజాగా ఓ ఘటన పోలీసులే బెదిరించి దొంగల్లా దోపిడీకి తెగబడ్డారు. నవజీవన్ ఎక్స్ప్రెస్లో బంగారం కొనుగోలు చేసేందుకు నెల్లూరు వెళుతున్న వ్యాపారులను బెదిరించి రూ.82 లక్షలు దోపిడీ చేశారు. ఈ ఘటన నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గురువారం సంచలనం సృష్టించింది. బాధితులు ఇచ్చిన సమాచారంతో స్పందించిన పోలీసులు నిందితులను వెంబడించి కొన్ని గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.82లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విచారించగా వీరిలో ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులని తేలినట్లు సమాచారం. నెల్లూరు జిల్లా కావలికి చెందిన వేమూరి రామయ్య, బి.ఎం.సునీల్ బంగారం కొనుగోలు నిమిత్తం కావలి నుంచి నెల్లూరుకు రైలులో వెళ్తుండగా పోలీసులమని చెప్పిన నిందితులు తనిఖీల పేరిట వ్యాపారులను బెదిరించి వారి వద్ద ఉన్న నగదును దోచుకున్నారు.
దాంతో లబోదిబోమంటూ వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు జాతీయ రహదారిపై పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు గుడ్లూరు కూడలి వద్ద కందుకూరు దిశగా వెళ్లినట్లు గుర్తించారు. మార్గమధ్యంలో నిందితులు అద్దె కారు కోసం ఓ కారుపై ఉన్న నంబరుకు ఫోన్ చేశారు. ఆ కాల్ను అందుకున్న డ్రైవర్ అందుకు నిరాకరించాడు. తర్వాత అటువైపు వచ్చిన పోలీసులు ఆరా తీసినపుడు డ్రైవర్ తనకు వచ్చిన ఫోన్ విషయం చెప్పి.. ఆ నంబరిచ్చాడు. ఈ నంబరును ఆధారంగా దొంగలు ఎక్కడున్నదీ, ఎటువెళుతున్నదీ పోలీసులు గుర్తించారు. రెండు గంటల తర్వాత ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం అలవలపాడు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు స్పెషల్పార్టీ కానిస్టేబుళ్లు ఉన్నట్లు సమాచారం. అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more