Jayalalithaa acquitted by Karnataka high court in 18-yr-old DA case

Celebrations in tamilnadu mounted as jayalalithaa acquitted in da case

Karnataka High Court acquitts Jayalalithaa, Jayalalithaa acquitted by Karnataka high court, Jayalalitha, former Tamil Nadu chief minister J Jayalalithaa, Tamil Nadu, Karnataka, Section 144, High Court. Disproportionate assets case, Code of Criminal Procedure, Tight security arrangements, Karnataka High Court, karnataka high court judgement, karnataka high court verdict, aiadmk

The Karnataka high court on Monday acquitted former Tamil Nadu +chief minister and AIADMK supremo J Jayalalithaa in the disproportionate assets case, celebrations in aiadmk camp

తమిళనాట పండగ వాతావరణం.. 17న సీఎంగా జయ ప్రమాణం..

Posted: 05/11/2015 12:53 PM IST
Celebrations in tamilnadu mounted as jayalalithaa acquitted in da case

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టులో కష్టాలు తోలగిపోవడంతో.. తమిళనాడులో పండగ వాతావరణం అలుముకుంది. అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరపణా అగ్రహరా ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి కొట్టేశారు. దీంతో గత 18 ఏళ్లుగా కోనసాగుతున్న ఈ కేసులో ఎట్టకేలకు జయలలితకు స్వేచ్ఛ లభించడంతో తమిళనాడులో అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

జయలలిత అక్రమాస్థుల కేసులో ఇవాళ న్యాయస్థానం తీర్పును వెలువరించనుందన్న నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు పరిసరాల్లోకి చేరుకున్న జయలలిత అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద పెట్టున జయజయధ్వానాలు చేశారు. దీంతో కోర్టు పరిసర ప్రాంతాలు జయలలిత నినాదాలతో హోరెత్తాయి. న్యాయస్థానం తీర్పు వెలువరించిన విషయం తెలియగానే తమిళనాడు వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. అన్నాడీఎంకే కార్యకర్తలు, జయలలిత అభిమానులు బాణాసంచా పేల్చారు. దీంతో తమిళనాడు టపాసుల మోతతో హోరెత్తిపోతోంది. సంబరాల జోరు క్షణక్షణానికి పెరుగుతోంది. చెన్నైలోని జయలలిత నివాస ప్రాంతం, అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం పరిసరాల్లో జయలలిత నినాదాలు హోరెత్తుతున్నాయి.

మరోవైపు.. పరప్పణ అగ్రహార కోర్టు జైలు శిక్ష తో పాటు జరిమానాను విధించినప్పటి నుంచి ఇంటికే పరిమితమైన జయలలిత.. ఇక మరోమారు పార్టీ పగ్గాలను అందుకోనున్నారు. తమళనాడు ముఖ్యమంత్రిగా మరోమారు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆమె సంసిద్దత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా మరోమారు ప్రమాణం చేసేందుకు ఈ నెల 17న ముహుర్తాన్ని ఖరారు చేశారు. అయితే ఇందుకోసం ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ కోణిజేటి రోశయ్యకు కూడా సమాచారం అందించినట్లు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalithaa  karnataka high court  judgement  aiadmk  CM  celebrations  

Other Articles