కృషి వుంటే మనుషులు రుషులవుతారు.. మహాపురుషులవుతారు.. తరతరాలకూ చెరగని వెలుగవుతారు.. ఇలవేలుపులవుతారు అన్న సినీ కవులు పదకొండేళ్ల ప్రాయంలోనే ఒంట పట్టించుకున్న ఓ చిన్నారు బాలుడు.. ప్రపంచంలో ఇంత వరకు ఎవరూ సాధించని అరుదైన ఘనతను సాధించాడు. అదే న్యూస్ ప్రెజెంటర్ గా. కృషితో నాస్తి దుర్భిక్షం అంటూ.. సంకల్పాన్ని మించిన బలం లేదని రుజువు చేస్తూ పుట్టుకతోనే చూపును కోల్పోయిన శ్రీరామానుజన్ మరో సంచలనానికి నాంది పలికాడు. ఒక తమిళ న్యూస్ ఛానల్లో న్యూస్ యాంకరింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
అందరికంటే భిన్నంగా ఏదైనా సాధించాలని తపన పడిన రామానుజం, దానికి టీవీ మీడియాను వారధిగా ఎంచుకున్నాడు. టీవీలో వార్తలు చదవడం ద్వారా తన గురించి పదిమందికి తెలియజేయాలనుకున్నాడు. తనలాంటి వారికి స్ఫూర్తిగా నిలవాలనుకున్నాడు. తమిళనాడుకు చెందిన లోటస్ న్యూస్ రామానుజం లోని తపనను చూసి అవకాశాన్ని అందించింది. నిన్న రాత్రి రామానుజం సదరు వార్త ఛానెల్ లో న్యూస్ ప్రెజెంట్ చేశాడు. నేపాల్ భూకంపం తర్వాత పరిణామాలు, మహింద్రా రాజపక్సే ట్రయల్ తదితర వార్తలతో కూడిన 22 నిమిషాల న్యూస్ బులిటెన్ను బ్రెయిలీ లిపి సహాయంగా శ్రీరామానుజం ప్రెజెంట్ చేశాడు. అది చూసిన అతని తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు. వారి కన్నుల నిండా ఆనందబాష్పాలు వర్షించాయి. ముందు రెండు నిమిషాలు కొంచెం తడబడ్డా, అలవాటైన తర్వాత బాగా చదివానంటూ శ్రీరామానుజం ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
ప్రస్తుతానికి శ్రీరామానుజానికి వారానికి ఒక స్పెషల్ బులిటెన్ ఇస్తున్నామని.. తరువాత రెగ్యులర్గా వార్తలు చదివే అవకాశాన్ని కల్పిస్తామని ఛానల్ ఛైర్మన్ తెలిపారు. సెల్వకుమార్ తెలిపారు. నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు వికలాంగులను ప్రోత్సహించాలన్న సదుద్దేశ్యంతోనే తాము రామానుజానికి అవకాశం కల్పించామన్నారు. ప్రపంచంలో తొలిసారిగా ఒక అంధుడి చేత ప్రైమ్ టైమ్ లో వార్తలను చదివించిన ఘనత తమ ఛానల్ దక్కించుకుందని ఆయన తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more