భారత్ లో టైటానియం పరిశ్రమల స్థాపనకు లంచాలు ఇచ్చారన్న అభియోగాల కేసులో ఉక్రెయిన్ వ్యాపార దిగ్గజం డైట్రో ఫిర్తాష్ ను తమకు అప్పగించాలన్న అగ్రరాజ్యం అమెరికాకు అస్ట్రియాలోని వియన్నా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫిర్తాష్ ను అమెరికా ఎఫ్ బి ఐ అధికారులకు ఎట్టి పరిస్థితులలోనూ అప్పగించేది లేదని వియన్నా నేర సంబంధిత ప్రాంతీయ కోర్టు తేల్చిచెప్పింది. ఉక్రెయన్ కు చెందిన ఫిర్తాష్ తన గ్రూపుకు చెందిన డిఎఫ్ పేరుతో భారత్ లో టైటానియం సంస్థల ఏర్పాటు కోసం సుమారు 18.5 మిలియన్ల డాలర్లను లంచాలుగా ఇచ్చిరని అయనపై అమెరికాలోని చికాగో జిల్లా కోర్టు అభియోగాలు నమోదు చేసింది.
ఈ వ్యవహారంలో పిర్తాస్ ను అదుపులోకి తీసుకోవాలని అమెరికా న్యాయస్థానం, ఎఫ్ బి ఐ అధికారుల వినతిపై అస్ట్రీయా ప్రభుత్వం అయనను అరెస్టు చేసింది. పిర్తాష్ పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నవియన్నా న్యాయస్థానం ఆయనను దేశం విడిచి వెళ్లరాదని అదేశించింది. ఈ క్రమంలో ఆయనకు ఇటీవల రికార్డు స్థాయిలో 125 మిలియన్ యూరోలను పూచికత్తుగా తీసుకన్న న్యాయస్థానం బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ క్రమంలో తమకు పిర్తాష్ ను అప్పగించాలన్న అస్ట్రేలియా అభ్యర్థను వియన్నా న్యాయస్థానం తోసిపుచ్చింది. అమెరికా అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేమని, ఇందులో రాజకీయ అంశఆలు కూడా కారణాలుగా కనబడుతున్నాయని అందకే అతనని అప్పగించలేమని తేల్చిచెప్పింది.
కాగా, టైటానియం పరిశ్రమ స్థాపనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సమైక్య రాష్ట్రంలో ఆయన ఆంధ్రప్రదేశ్ లోనూ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారని, ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ రాజకీయ సలహాదరుగా వున్న కేవీపీ రామచంద్రరావుకు కూడా లంచాలు ఇచ్చారని ఆరోపణలు వున్నాయి. ఈ వ్యవహరాంలో ప్రధాన నిందితుడు పిర్తాష్ ను అదుపులోకి ఇచ్చేందుకు అస్ట్రీయా న్యాయస్థానం సమ్మతించకపోవడంతో.. ఇక ఈ కేసులో కేవీపీని కూడా అమెరికా చికాగో కోర్టు విచారించే అవకాశం లేదని న్యాయనిపుణులు సూచించడంతో ఆయనకు ఊరట లభించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more