ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాలను . ఏపీ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కర్నూలులో విడుదల చేశారు. మొత్తం 2,90,789 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొదటి స్థానంలో కృష్ణా- 83% జిల్లా ఉండగా చివరి స్థానంలో కడప-50% ఉత్తీర్ణత సాధించింది. గతంలో లాగా ఈ ఏడాది కూడా ఇంటర్ సెకండియర్ లో బాలికలదే పై చేయి. బాలికలు-74.80శాతం, బాలురు-69.43శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లొ ఎ గ్రేడ్- 72.07శాతం, బి గ్రేడ్ -29.1శాతం, సి గ్రేడ్-1 12.7శాతం, డి గ్రేడ్- 3.3 శాతం ఉత్తీర్ణ సాధించారు. గతంలో పోలిస్తే ఉత్తీర్ణత 1.19 పెరిగిందని గంటా శ్రీనివాస్ వెల్లడించారు. మే 25 నుండి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా, ఇంటర్ బోర్డు కార్యదర్శి, కమిషనర్ ఎంపీ సత్యనారాయణ పాల్గొన్నారు.
ఇంటర్ సెకండియర్ ఫలితాలను ప్రభుత్వ వెబ్సైట్లలో ఉంచారు. ఫలితాలను అప్పటికపుడు తెలుసుకునేందుకు వీలుగా పరిష్కారం కాల్ సెంటర్ల ద్వారా ఏర్పాట్లు చేశారు. అభ్యర్ధులు 1100 నెంబర్కు ఫోన్ చేసి లేదా 18004254440 నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఎయిర్టెల్ వినియోగదారులు 5207051కు, వోడాఫోన్ వినియోగదారులు 58888711కు, మిగిలిన వినియోగదారులు 58888కు ఫోన్ చేసి మార్కులు పొందవచ్చు. ఐపిఇ టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్టిక్కెట్ నెంబర్తో 54242కు మెసెజ్ పంపించి మార్కులు పొందవచ్చు. ఫలితాలను ప్రకటించే వెబ్సైట్లు: http://examresults.ap.nic.in, http://results.cgg.gov.in
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more