తనకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకున్న ఆ వధువు జీవితాన్ని త్యాగం చేసింది. ఆలా చెబితే కూడా సరిపోదనుకుంటా..? ఎందుకంటే అమె త్యాగానికే నిర్వచనాన్ని చెప్పింది. జీవిత్యాన్ని త్యాగం చేయడమంటే.. ఒకరి కోసం తాను ప్రాణాన్ని వదలడం కాదు.. తాను ఉన్నంత వరకు తన జీవితాన్ని ధారపోయడమే నిజమైన త్యాగమని, గోప్ప త్యాగనిరతిని ప్రదర్శించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 ఏళ్లుగా మంచాన వున్న ఓ వ్యక్తిని తాను మనస్సుతో ప్రేమించానని, తన మనస్సును అర్థం చేసుకున్నానని, పెద్దలు వారించినా.. కన్నవారు నిలువరింపజేసినా.. వారందరినీ తోసిరాజని అమె అతడిని పెళ్లి చేసుకుంది.
పెళ్లైన ప్రతీ పడతిలోనే వుండే ఆలోచనలు తన భర్తతో సాయంకాల వేళ్లలో ఆహ్లాదంగా గడపాలన్న యావ, తన భర్త ఆఫీసుకు వెళ్తుంటే అన్నీ తానై వడ్డించి, వారించి.. సేవ చేయాలన్న తపన, అమెలోనూ వున్నాయి. అయితే వాటన్నింటినీ దిగమింగుకుని.. తన మనస్సుకు నచ్చిన వాడు అవన్నీ చేయలేడని తెలిసి కూడా వివాహానికి సై అనింది. తన భర్తకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని భావించింది. అమ్మాయిలు ఇలా కూడా వుంటారా అని అలోచింపజేసేలా చేసింది. రెండు దశాబ్దాలుగా ( సుమారు ఇరవై ఏళ్లుగా) పడకకే పరిమితమైన యువకుడిని ఆ యువతి పరిణయమాడి.. ఔరా అనిపించింది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా సామియార్ మఠానికి చెందిన జార్జి విలియమ్, అన్నమ్మాళ్ దంపతుల కుమారులైన విజయకుమార్, జయకుమార్ అనారోగ్యంతో పదేళ్ల వయసులోనే మంచం పట్టారు. తల్లిదండ్రులు ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం దక్కలేదు. వారిప్పుడు 30 ఏళ్ల వయసుకు చేరుకున్నారు. కాగా, తిరునల్వేలి జిల్లా నాంగునేరీకి చెందిన శివకులదేవి సెల్ఫోన్ ద్వారా జయకుమార్తో పరిచయం పెంచుకుంది. వీరి పరిచయం క్రమేణా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. పెద్దలు తొలుత తిరస్కరించినప్పటికీ శివకులదేవి వారిని మెల్లగా ఒప్పించింది. ఈ నెల 22వ తేదీన జయకుమార్ మంచంపై నుంచి లేవలేని స్థితిలోనే ఆమెను వివాహం చేసుకున్నాడు.
అయితే జయకుమార్ చిన్నబ్బాయి. మరి పెద్దబ్బాయి విజయకుమార్ సంగతేంటని అడుగుతున్నారా..? అక్కడికే వస్తున్నాం. విజయకుమార్ ను కూడా ఓ అమ్మాయి వరించింది. అయన పరిస్థితి గురించి తెలుసుకున్న కేరళకు చెందిన మంజూష సామియార్ వారుంటున్న మఠానికి చేరుకుని విజయకుమార్ పట్ల సానుభూతి ప్రకటించింది. పెద్దబ్బాయి విజయకుమార్ను 2012లో పెళ్లి చేసుకుంది. మొత్తానికి అన్నదమ్ములిద్దరూ అదృష్టవంతులు అందుకనే వారు కదలలేని స్థితిలో వున్నా చక్కని సతీమణులు లభించారని మఠంలోని వారందరూ వారిని మెచ్చుకుంటున్నారు. కాగా వారిని పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు మఠంలో ప్రత్యేక గౌరవం కూడా లభిస్తోంది. మరి వారు చేసిన త్యాగం కూడా అలాంటిదేగా మరి..
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more